Moviesఆహాలో టాక్ షో కోసం అల్లు అరవింద్ బాలకృష్ణను ఎలా ఒప్పించాడో...

ఆహాలో టాక్ షో కోసం అల్లు అరవింద్ బాలకృష్ణను ఎలా ఒప్పించాడో తెలుసా..?

నందమూరి బాలకృష్ణను ఇప్పటి వరకు హీరోగా, రాజకీయ నాయకుడిగా చూశాం. ఇప్పుడు ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు నటసింహం. ఆహా ఓటీటీ కోసం హోస్ట్ గా మారబోతున్నారు. తన కెరీర్ లోనే ఇది వరుకు ఎప్పుడు చేయని యాంకరింగ్ వైపు అడుగులు వేసారు నందమూరి బాలకృష్ణ. ఆహా వాళ్లతో కలిసి బాలకృష్ణ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం హోస్ట్ గా చేయబోతున్నారు. బాలయ్య యాంకరింగ్ చేస్తున్నారు అంటే అందరికి ఆశ్చర్యంగానే ఉంది. ఆహ ఓటిటిలో బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో చేయబోతున్నారు.

‘అన్‌స్టాప‌బుల్‌’ పేరుతో ఈ షో రాబోతుంది. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ షోతో హీరో బాలకృష్ణ తన డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో బాలయ్య ఎంట్రీ గురించి నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్‌స్టాప్‌బుల్ షోలో మొత్తం 12 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కానున్నాయి. మంచు ఫ్యామిలీతో బాల‌య్య చేసిన తొలి ఇంట‌ర్వ్యూకు సంబంధించిన తొలి ఎపిసోడ్ ప్రోమోయే దుమ్ము రేపేసింది. తొలి ఎపిసోడ్‌లోనే బాల‌య్య వ‌ర్సెస్ మోహ‌న్‌బాబు మ‌ధ్య కాస్త ఘాటైన మాట‌ల తూటాలు పేలాయ‌ని తెలుస్తోంది.

అయితే బాలకృష్ణను యాంకరింగ్ చేయించడానికి అల్లు అరవింద్ ఎలా ఒప్పించాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇంతకి అరవింద్ బాలయ్యను ఎలా ఒప్పించాడొ తెలుసా..??ఆహాలో ఏదైనా మంచి టాక్ షో చేద్దాం అని టీం అంతా బాగా డిస్కస్ చేస్తున్నప్పుడు ..ఎవరైతే బాగుంటారు అని అనుకుంటున్నప్పుడు..అరవింద్ సడెన్ గా బాలయ్య పేరు చెప్పారట. ఇక ఇదే విషయాని బాలయ్య కు ఫోన్ చేసి మెల్లగా చెప్పాడట అరవింద్.

మీరు ఆహా లో సమంత టాక్ షో చూశారా అని అల్లు అర‌వింద్‌ అడిగితే యస్..చూసాను అని అన్నారట.. అలాంటి ఒక షో అనుకుంటున్నాం.. మీరు హోస్టింగ్ చేస్తే బాగుంటుంది అని బాలయ్యను అడిగితే బాలయ్య కూడా ఓకే అన్నాడట . ఇక అంతే ఆహా టీం వచ్చి బాలయ్యకు కాన్సెప్ట్ చెప్పడం..ఆయనకు నచ్చడంతో.. బాల‌య్య‌ కూడా యాంకరింగ్ చేయడానికి ఓకే చెప్పాడట .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news