Moviesభీమ్లా నాయ‌క్‌ను తొక్కేస్తోందెవ‌రు.. ఆ టాప్ నిర్మాత టార్గెట్ అయ్యాడే..!

భీమ్లా నాయ‌క్‌ను తొక్కేస్తోందెవ‌రు.. ఆ టాప్ నిర్మాత టార్గెట్ అయ్యాడే..!

ఈ సంక్రాంతికి టాలీవుడ్ వార్ య‌మ రంజుగా ఉండేలా ఉంది. ఇప్ప‌టికే జ‌న‌వ‌రి 7న ఆర్ ఆర్ ఆర్ వ‌స్తోంది. జ‌న‌వ‌రి 14న రాధే శ్యామ్ వ‌స్తోంది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లా నాయ‌క్ కూడా సంక్రాంతి రేసులోనే ఉంది. సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మ‌హేష్‌బాబు స‌ర్కారు వారి పాట మాత్రం స‌మ్మ‌ర్‌కు వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు సంక్రాంతి బ‌రిలో ఉన్న భీమ్లా నాయ‌క్‌ను ఏదోలా బ‌ల‌వంతంగా వాయించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

రాధేశ్యామ్‌ను వాయిదా వేయ‌ర‌ట‌. ఆ సినిమా ఇప్ప‌టికే వ‌డ్డీల భారంతో ఉంది. అయితే ఇప్పుడు ఇండ‌స్ట్రీకే చెందిన ఓ పెద్ద నిర్మాత ఆర్ ఆర్ ఆర్‌తో పాటు రాధే శ్యామ్ రైట్స్ కూడా కొన్ని ఏరియాల‌కు తీసేసుకున్నారు. ఇందుకోసం ఆయ‌న రు. 150 కోట్లు వ‌ర‌కు పెట్టార‌ని అంటున్నారు. పండ‌గ‌కు ఈ రెండు సినిమాలే పోటీలో ఉంటే ఆయ‌న‌కు ఇబ్బంది ఉండ‌దు. ఏ సినిమా హిట్ అయినా.. మ‌రొక‌టి యావ‌రేజ్ అయినా ఆ ఏరియాల్లో డ‌బ్బంతా ఆయ‌న ఖాతాలోకే వెళుతుంది.

అదే భీమ్లా నాయ‌క్ కూడా ఉంటే కొన్ని థియేట‌ర్లు అటు షేర్ అయిపోతాయి. పైగా భీమ్లా నాయ‌క్ రైట్స్ కూడా ఆయ‌న‌వే అట‌. మూడు సినిమాలు వ‌స్తే త‌న‌కు భారీ న‌ష్టం త‌ప్ప‌ద‌న్న అంచ‌నాకు ఆయ‌న వ‌చ్చేశార‌ట‌. అయితే ఆయ‌న నేరుగా వెళ్లి ప‌వ‌న్‌ను క‌లిసి సినిమా వాయిదా వేయ‌మ‌ని అడిగే ఛాన్స్ లేద‌ట‌. అందుకే ఇప్పుడు నిర్మాత‌ల వైపు నుంచి న‌రుక్కు వ‌చ్చే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టేశార‌ట ఆ డిస్ట్రిబ్యూట‌ర్ కం నిర్మాత‌.

అయితే ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్రం త‌మ హీరో సినిమాను సంక్రాంతికి కాకుండా.. వాయిదా వేస్తే ఊరుకోమంటూ ఆ సినిమా నిర్మాత‌లు మైత్రీ మూవీస్ వాళ్ల‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు త‌మ హీరో సినిమాను సంక్రాంతికి రిలీజ్ కాకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోన్న ఆ టాప్ నిర్మాత‌ను కూడా ప‌వ‌న్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news