Moviesఅమ్మ పై ఉన్న ప్రేమతో జాన్వీ ఏం చేసిందో తెలుసా..??

అమ్మ పై ఉన్న ప్రేమతో జాన్వీ ఏం చేసిందో తెలుసా..??

జాన్వీ కపూర్..బాలీవుడ్ బ్యూటీ అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓరేంజ్ లో దూసుకుపోతున్న ఈ గ్లామర్ బ్యూటీ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బాగా బిజీ గా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో గ్లామర్ విందునే వడ్డిస్తుంది. జాన్వీ కపూర్‌ స్కిన్‌ షో విషయంలో ఏ మాత్రం తగ్గదు. గ్లామరస్‌ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటుంది. ఓ పక్క సినిమాల్లో రెచ్చిపోతూ బీ టౌన్ ఆడియెన్స్ ను అలరిస్తున్న అమ్మడు సోషల్ మీడియాలో సెమీ న్యూడ్ పిక్స్ తో షేక్ చేస్తుంది. పొట్టి డ్రెస్సుతో పిచ్చెక్కించడం జాన్వీ స్పెషాలిటి.

అయితే శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఆమె వేసుకున్న టాటూ. తాజాగా జాన్వీ తన చేతిపై ఓ టాటూ వేసుకుంది. అందులో ‘ఐ లవ్‌ యూ లబ్బూ’ అని రాసి ఉంది. అయితే ‘లబ్బు’ ఎవరు?… ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది జాన్వీ కపూర్ ఫ్యాన్స్ ఇదే ప్రశ్నతో సతమతం అయ్యారు. ‘ఐ లవ్ యూ’ అనే పదాలు చూసే సరికి ‘లబ్బు’ ఎవరై ఉంటారని ఊహాగానాలు చెలరేగాయి. ఆమె ఎవర్నో డేటింగ్ చేస్తోందంటూ… జాన్వీ బాయ్‌ఫ్రెండ్ కోసమే పచ్చబొట్టు వేయించుకుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో ఈ విషయం పై ఆమే క్లారిటీ ఇస్తూ ఓ పోస్ట్ పెట్టింది.

‘లబ్బూ’ అనే ఎవరో కాదు.. అని శ్రీదేవి.. ఆ ముద్దు పేరుతో అమ్మ శ్రీదేవి పిలిచేదట. కొన్ని సంవత్సరాల క్రితం జాన్వీ రాసిన లేఖలోని మొదటి పదాలు అని ఆ తర్వాత తెలిసింది. చిన్నప్పుడు శ్రీదేవి పేపర్ పై రాసిచ్చిన ‘ఐ లవ్ యూ మై లబ్బు’ అనే చిన్న బర్త్ డే నోట్‌ను జాన్వీ ఇన్ స్టాలో ఫాలోయర్స్‌తో పంచుకుంది దీన్ని బట్టి చూస్తే.. తన తల్లి అంటే జాన్వీకి ఎంత ప్రేమ ఉందో అందరికి తెలుస్తోంది. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందులో ప్రధానంగా చెప్పుకుంటే.. సిద్ధార్త్ సేన్‌గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గుడ్ లక్‌ జెర్రీ’, ‘రన్‌భూమి’, ‘దోస్తానా-2’, ‘తక్త్-2’ తదితర సినిమాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news