Moviesఆ ఒక్క రీజన్ తోనే కోట్ల రెమ్యునరేషన్ వెనక్కిచిన హీరో..ఎందుకో తెలుసా..??

ఆ ఒక్క రీజన్ తోనే కోట్ల రెమ్యునరేషన్ వెనక్కిచిన హీరో..ఎందుకో తెలుసా..??

గ‌తంలో సినిమాలు చేసిన హీరోలకి..నేటి తరం హీరోలకి చాలా తేడా ఉంది. ముఖ్యంగా పారితోషకం విషయంలో అనే చెప్పాలి. నేటి త‌రం హీరోలు హీరోయిన్లు న‌టులు మాత్రం రెమ్యున‌రేష‌న్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.. కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు. అంతేకాదు నిన్న కాక మొన్న వచ్చిన హీరోలు కూడా ఒక్క సినిమా హిట్ అయితే వాళ్ళ పారితోషకాని అమాంత పెంచేస్తౌన్నారు. ఒక్కో హీరో సినిమాకు తీసుకునే న‌గ‌దు కోట్లకు కోట్లు దాటిపోతుంది. మార్కెట్ బ‌ట్టీ హీరోల‌కి రెమ్యున‌రేష‌న్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక స్టార్ హీరోలు ఏడాదికి సినిమాల నుంచి 50 నుంచి 80 కోట్లు సంపాదిస్తున్నారు. చిన్న హీరోలు సైతం ఏడాదికి 20 కోట్ల పై మాటే..మొత్తానికి గ‌తానికి ఇప్ప‌టికీ చాలా తేడా వ‌చ్చింది అంటున్నారు సినిమా విశ్లేష‌కులు.

సినిమా కి తీసుకున్న పారితోషకాని వెనక్కి ఇచ్చేసి హాట్ టాపిక్ గా మారాడు యం అండ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి. ఒక్కప్పుడు ఈ పేరు చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఒక్క సినిమా .. ఒక్కే ఒక్క సినిమా తరువాత ఈయన బాగా పాపులర్ అయ్యిపోయాడు. అదే “జాతి రత్నాలు”. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు అందుకున్న నవీన్ పోలిశెట్టి.. ఇటీవల వచ్చిన జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో నవీన్ పర్ ఫామెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా విడుదలైన నెలలు గడుస్తున్న నవీన్ కు పెద్ద ఆఫర్లు రాకపోవడం గమనార్హం. అయితే తాజాగా నవీన్ కు సంబంధించి నెట్టింట ఓ వార్త వైరల్ గా మారింది.

నవీన్ పోలిశెట్టి సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసి 4 కోట్ల అడ్వాన్స్‌ కూడా తీసుకున్నాడట. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా కాన్సిల్‌ అవ్వడం వల్ల.. అడ్వాన్స్‌ కూడా తిరిగి ఇచ్చేసినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. కథలో కొన్ని మార్పులు చేయాలని డైరెక్టర్‌కు సూచించినా.. అది వర్క్ అవుట్ కాకపోవడంతో నవీన్‌ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టేసాడట. అందుకే తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేశాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news