Moviesఆ సినిమా కారణంగా అప్పులపాలైన రోజా..లాస్ట్ కి ఎలా అప్పు తీర్చిందో...

ఆ సినిమా కారణంగా అప్పులపాలైన రోజా..లాస్ట్ కి ఎలా అప్పు తీర్చిందో తెలుసా..??

తెలుగు సిని సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు రోజా గురించి అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే రోజా.. సినీ నటి రోజా.. ఫైర్ బ్రాండ్ రోజా.. జబర్దస్త్ జడ్జీ రోజా.. పేరు ముందు ప్రొఫెషన్స్ మారిన రోజా పేరు మాత్రం కామన్‌గా ఉంటూ వస్తోంది. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన అందం అభినయంతో ఇంత మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి సూపర్ స్టార్ హీరోయిన్ లలో రోజా కూడా ఒకరు.

మొదటి సారిగా ప్రేమ తపస్సు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఆ త‌ర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ అప్పుడ‌ప్పుడు వెండితెర‌పై మెరుస్తున్నారు. ఇక బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అప్పుడప్పుడు వెండితెర‌పై హీరోయిన్‌గా కాకుండా తల్లి, అక్క ఇలా క్యారెక్టర్లను చేస్తోంది రోజా. అయితే రోజా ఒకవైపు రాజకీయ నాయకురాలిగా సేవలు అందిస్తూనే మరోవైపు టీవీ షోలలో కనిపిస్తుంటారు.

ఇక తమిళ డైరెక్టర్ సెల్వమణి తో వివాహం చేసుకున్న తర్వాత రోజా.. తన అన్నని బాగా సెటిల్ చేయాలని భావించి “సమరం” అనే సినిమా చేశారట. దాంతో వాళ్ళ జీవితాలు సెటిల్ అవుతాయి అనుకుంటే..కధ టోటల్ రివర్స్ అయ్యిందని..మొత్తం సినిమా టైటిల్ కు తగ్గట్టుగా మారిపోయినట్లు తెలియజేసింది రోజా . ఇక ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో రోజా ఫ్యామిలీ మొత్తం అప్పుల పాలయ్యారట. తెలియజేసింది.ఇక ఆ అప్పులు తీర్చడం కోసం రోజా 2002 వరకు వరుస సినిమాలు చేస్తూ..దాని ద్వార వచ్చిన డబ్బును అప్పులు కడుతూనే ఉన్నారట రోజా. ఇక ఈ విషయాలని ఆమె తాజాగా జరిగిన వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రాంలో చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news