Moviesమహానటిలో సావిత్రిగా నటించే గొప్ప అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకున్న స్టార్...

మహానటిలో సావిత్రిగా నటించే గొప్ప అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

నిత్యా మీనన్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈమె పేరుకు మళయాల ముద్దుగుమ్మ అయినా కూడా తెలుగులోనూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. అలా మొదలైంది సినిమాతో మొదలు పెట్టి ఇక్కడ కూడా చాలా సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో ‘అలా మొదలైంది’ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ తొలి సినిమాతోనే నటిగా తనదైన ముద్ర వేసింది. నిత్యం టాలీవుడ్ లో మరో సౌందర్య అనిపించుకునే ఈ అమ్మడు అందరి కంటే భిన్నంగా మనసుకు నచ్చిన చిత్రాలు మాత్రమే చేస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది. కెరియర్ లో చేసినవి తక్కువ సినిమాలే అయిన నిత్య తన బ్రాండ్ చూపించింది అని చెప్పాలి.

అయితే , తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించింది ‘మహానటి’. ఈ సినిమా లో సావిత్రి గా నటించింది మన అభిమాన నటి కీర్తి సురేష్. ఈ చిత్రంలో సావిత్రి పాత్ర చేసిన కీర్తి సురేష్ కు ఎంత గొప్ప పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతకుముందు ఆమెను రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ లాగే చూసేవాళ్లు. కానీ ఈ సినిమా తర్వాత ఆమె ఇమేజే మారిపోయింది. ఆమెను గొప్ప నటిగా గుర్తిస్తున్నారు.

అలాగే ఈ పాత్రకు ప్రాణం పోసింది. కీర్తి సురేష్ ను చూస్తుంటే సావిత్రి మళ్ళీ జన్మించినట్లుందని సావిత్రి గారి కూతురు చెప్పారు. అంతలా తన క్యారక్టర్ లో మునిగిపోయింది కీర్తి సురేష్. ఐతే నిజానికి ముందు ‘మహానటి’ కోసం అనుకున్న నటి కీర్తి కాదు. దక్షిణాదిన నటించిన ప్రతి భాషలోనూ మంచి నటిగా గుర్తింపు సంపాదించిన నిత్య మీనన్ ను ముందు సావిత్రి పాత్రకు అడిగారు.

ఆమె కూడా ఒక దశలో ఓకే అంది. కానీ కారణాలేంటో తెలియదు కానీ.. తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఈ విషయంలో తనకు రిగ్రెట్స్ ఏమీ లేవని అంది కానీ.. ‘మహానటి’ సాధించిన విజయం – కీర్తికి వచ్చిన పేరు చూశాక నిత్యలో ఏదో ఒక మూల బాధ లేకుండా ఉండదు కదా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news