Moviesసమీరా రెడ్డికి కన్యాదానం చేసింది ఎవరో తెలిస్తే.. మైండ్ బ్లాకే..!!

సమీరా రెడ్డికి కన్యాదానం చేసింది ఎవరో తెలిస్తే.. మైండ్ బ్లాకే..!!

సమీరా రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈమెకు మంచి ఇమేజ్ ఉంది. ఒకప్పుడు వరసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసింది సమీరా. తెలుగులో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్‌తో నటించింది. ‘మైనే దిల్‌ తుజ్కో దియా’ హిందీ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది సమీరా రెడ్డి.

ఆ తర్వాత గ్లామర్ రోల్స్ చేసి బాలీవుడ్‌లో బాగానే గుర్తింపు సంపాదించుకుంది. అయితే నెపోటిజమ్ కారణంగా తనకు అక్కడ అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చింది సమీరా. చాలా సినిమాల్లో ముందు తనను హీరోయిన్‌గా తీసుకుని ఆ తర్వాత తీసేసారంటూ చెప్పుకొచ్చింది ఈమె.

సమీరా రెడ్డి.. 11ఏళ్ల కిందట జూనియర్ ఎన్టీఆర్‌తో ‘అశోక్’‌తో పాటు ’నరసింహుడు’ సినిమాల్లో నటించింది. అంతేకాదు చిరంజీవి హీరోగా నటించిన ‘జై చిరంజీవా’ సినిమాలో కథానాయికగా నటించింది కూడా. అయితే, అప్పట్లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నరసింహుడు, అశోక్ సినిమాల్లో నటించి.. అతడిని పెళ్లి చేసుకుంటుందట అనే రూమర్స్‌కు కూడా కారణం అయింది సమీరా రెడ్డి.

తెలుగమ్మాయి కావడంతో నిజమే అనుకున్నారు కూడా. మరి కొన్ని రోజుల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు ప్రసారమయ్యాయి. అయితే అవ్వన్ని పుకార్లే.. మేము మంచి ఫ్రేండ్స్ అంటూ క్లారిటి ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ భామను అందరు మరిచిపోయారు.

తెలుగులో ఊహించిన విజ‌యం రాక‌పోవ‌డంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అయితే ఎక్క‌డా స్టార్ హీరోయిన్ హోదా మాత్రం అందుకోలేక‌పోయింది స‌మీరా రెడ్డి.

అయితే సమీరా రెడ్డి సినిమాల్లో ఆఫ‌ర్లు త‌గ్గిపోవ‌డంతో 2014లో అక్షయ్ వర్ధే అనే బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే సమీరా రెడ్డికి కన్యాదానం చేసిన వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా స‌మీరారెడ్డి వివాహంలో క‌న్యాదానం చేశాడు.

అంతేకాదు.. ఆయన ద‌గ్గ‌ర ఉండి మ‌రీ స‌మీరారెడ్డి వివాహం జరిపించారు. అయితే స‌మీరారెడ్డి, విజ‌య్ మాల్యా మంచి స్నేహితులట. ఇక పెళ్లి సమయంలో సమీరా బంధువులు ఎవరు రాలేదు. దాంతో ఆయనే సమీరాకి కన్యాదానం చేశారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news