Moviesపార్వతి మెల్టన్ జీవితాన్ని నాశనం చేసింది ఆ ఇద్దరు టాలీవుడ్ దర్శకులే..?

పార్వతి మెల్టన్ జీవితాన్ని నాశనం చేసింది ఆ ఇద్దరు టాలీవుడ్ దర్శకులే..?

ఇండో అమెరికన్ సినీనటి పార్వతి మెల్టన్. 2005లో దేవా కట్టా తెరకెక్కించిన వెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఎన్నారై బ్యూటీ . ఆ సినిమా తర్వాత చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. వెంటనే తెలుగు, తమిళంలో అవకాశాలు అందుకుంది. పార్వతి మెల్టన్ పలు భారతీయ భాషల్లో కూడా నటించింది. వెన్నెల సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై .. శ్రీమన్నారాయణ సినిమాతో చివరిసారిగా నటించింది.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా సినిమాలోనూ నటించింది పార్వతి. అంతేకాదు.. ఆ సినిమాతో పాటు మంచు విష్ణు గేమ్, అల్లరి నరేష్ అల్లరే అల్లరి, సుమంత్ మధుమాసం లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు దూకుడు సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ తప్ప ఆమె మరే అవకాశం కూడా దక్కించుకోలేక పోయింది.

క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గడంతో తన పర్సనల్ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేసింది. ఇక అప్పటి నుంచి సినీ పరిశ్రమలో కనిపించకపోగా ఇప్పుడు ఎక్కడ ఉందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

కానీ ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు చెక్ పెట్టేసిందని అర్థమవుతుంది. షాంసు లలాని అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి పోయింది పార్వతి మెల్టన్.

తన ఫ్యామిలీ లైఫ్ ఎంతో సరదాగా గడుపుతోంది. ఆమె సినిమాల్లోకి రావడానికి కారణం టాలీవుడ్ టాప్ దర్శకుడట. అయితే సినిమా రంగంలో ఇద్దరు టాలీవుడ్ దర్శకులు చేసిన మోసం వల్లనే తన కెరీర్ ఇలా అయిందని ఆమె ఓ ఇంటర్వ్యులో చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news