Newsబ్రేకింగ్‌:  వైసీపీ ఎంపీకి కరోనా పాజిటివ్‌

బ్రేకింగ్‌:  వైసీపీ ఎంపీకి కరోనా పాజిటివ్‌

ఏపీలో క‌రోనా అధికారా వైఎస్సార్‌సీపీ ప్ర‌జా ప్రతినిధుల‌ను వ‌ద‌ల‌డం లేదు. ఆ పార్టీకి చెందిన ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు ఇప్ప‌టికే కోవిడ్ భారీన ప‌డ్డారు. వీరిలో కొంద‌రు ఇప్ప‌టికే కోలుకోగా మరికొంద‌రు ఇంకా చికిత్స పొందుతున్నాడు. కొద్ది రోజుల క్రిత‌మే కోవిడ్ భారీన ప‌డ్డ తిరుప‌తి వైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ రోజు తిరుప‌తి ఎంపీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి ఏకంగా రెండోసారి కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది.

 

 

తాజాగా మరో వైఎస్సార్‌సీపీ ఎంపీ సైతం క‌రోనా భారీన ప‌డ్డారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఎంపీ హైదరాబాద్‌లో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న కార్యాల‌యంలో న‌లుగురు సిబ్బందికి కూడా క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయ్యింది.

 

త‌న‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంపై ఎంపీ శ్రీథ‌ర్ స్పందించారు. త‌గిన జాగ్ర‌త్త‌ల‌తోనే క‌రోనాను నివారించుకోవ‌చ్చ‌న్నారు. అలాగే గ‌త వారం రోజులుగా త‌న‌ను క‌లిసిన వారు అంద‌రూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎంపీ శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news