Newsకృష్ణా జిల్లాలో ఘోరం.. ప్రియుడి కోసం యువ‌తి షాకింగ్ స్కెచ్‌

కృష్ణా జిల్లాలో ఘోరం.. ప్రియుడి కోసం యువ‌తి షాకింగ్ స్కెచ్‌

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మ‌హిళ త‌న‌కు అడ్డుగా ఉన్నాడ‌ని కొడుకును చంపేసింది. జ‌గ్గ‌య్య‌పేట మండ‌లంలో జ‌రిగిన ఈ దారుణ సంఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. జ‌గ్గ‌య్య‌పేట మండలంలోని అనుమంచిపల్లెకు చెందిన ఉష అనే మహిళకు యేడాది క్రితం పెళ్ల‌య్యింది. అయితే ఆమెకు పెళ్లికి ముందే శ్రీను అనే యువ‌కుడితో ఎఫైర్ ఉంది. ఈ విష‌యం తెలిసిన భ‌ర్త ఆమెను దూరం పెట్టేశాడు. భ‌ర్త వ‌దిలేయ‌డంతో ఉష శ్రీనుతో క‌లిసి ఉంటోంది.

 

త‌మ కొత్త జీవితానికి త‌న కొడుకు అడ్డు వ‌స్తున్నాడ‌ని భావించిన ఉష అత‌డిని వ‌దిలించుకోవాల‌ని ప్లాన్ వేసింది. ఈ క్ర‌మంలోనే త‌న భ‌ర్త ( వ‌దిలేసిన వ్య‌క్తి)తో త‌న‌కు క‌లిగిన కొడుకును చంపేసి తెలంగాణ‌లోని కొదాడ స‌మీపంలో పాతి పెట్టింది. ఉష కుమారుడు రెండు రోజులుగా క‌నిపించ‌క‌పోవ‌డంతో స్థానికుల‌కు అనుమానం వ‌చ్చింది. కొంద‌రు పోలీసుల‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు.

 

పోలీసులు ఉష‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఉష – శ్రీను క‌లిపి త‌మ కొత్త సంసార జీవితానికి ఆ బాలుడు అడ్డు వ‌స్తాడ‌నే చంపేశామ‌ని వారు ఒప్పుకున్నారు. ఈ మ‌హాత‌ల్లి చేసిన ప‌ని ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల‌ను ఎంతో క‌లిచి వేస్తోంది. కేవ‌లం త‌మ సుఖానికి అడ్డుగా ఉన్నాడ‌ని ముక్కు ప‌చ్చ‌లార‌ని బాలుడిని చంపిన ఆమె క‌సాయి త‌ల్లి అని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news