Moviesర‌జ‌నీకాంత్ సినిమా ఆగిపోయింది.. నిర్మాత షాకింగ్ డెసిష‌న్‌

ర‌జ‌నీకాంత్ సినిమా ఆగిపోయింది.. నిర్మాత షాకింగ్ డెసిష‌న్‌

త‌లైవా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కోసం నిర్మాత‌లు షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌జ‌నీకాంత్‌తో క‌ళానిధి మార‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు రోబో, పేట సినిమాలు నిర్మించారు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆయ‌న ర‌జ‌నీతో ముచ్చ‌ట‌గా మూడో సినిమా తీయాల‌ని అనుకున్నారు. సిర‌త్తై శివ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కే ఈ సినిమాకు అన్నాతే పేరు పెట్టారు. నయనతార, కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 

ఏడు నెల‌ల క్రిత‌మే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ నెల 23 నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని అనుకున్నారు. అయితే నిర్మాత క‌ళానిధి మార‌న్ మాత్రం వ‌చ్చే జ‌న‌వ‌రి వ‌ర‌కు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాద‌ని చెప్పేశారు. ఇందుకు కార‌ణం క‌రోనా అని చెప్పేశారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీ వ‌య‌స్సు 69 ఏళ్లు. ఈ ఏజ్ వాళ్లకు కరోనా అత్యంత ప్రమాదంగా మారే ఛాన్సులు ఉండ‌డంతో ఇప్పుడు షూటింగ్ ప్రారంభించేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు.

 

ఇటీవ‌లే ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం సైతం ఓ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన సంగీత కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాకే క‌రోనా సోకి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న కోలుకోకుండానే మృతిచెందారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు 69 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ర‌జ‌నీతో ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు నిర్మాత మార‌న్ ఒప్పుకోవ‌డం లేదు. షూటింగ్ లేట్ అయినా త‌ర్వాతే ప్రారంభించాల‌న్న నిర్ణ‌యానికి నిర్మాత‌లు వ‌చ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news