Moviesన‌టి శ్రావ‌ణి కేసులో మ‌రో ట్విస్ట్‌... సినిమా ఛాన్సుల పేరుతో ద‌గ్గ‌రై...!

న‌టి శ్రావ‌ణి కేసులో మ‌రో ట్విస్ట్‌… సినిమా ఛాన్సుల పేరుతో ద‌గ్గ‌రై…!

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజుకో సంచ‌ల‌న వార్త బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఈ కేసులో ముందు నంచి ఆరోప‌ణలు ఎదుర్కొంటోన్న ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్‌రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నాడు. అశోక్ కోసం పోలీసులు ముమ్మ‌రంగా గాలిస్తున్నారు. ఈ కేసులో దేవ‌రాజ్ రెడ్డి, సాయికృష్ణా రెడ్డిని పోలీసులు ఇప్ప‌టికే అరెస్టు చేశారు. ఇక ఏ 2 నిందితుడిగా ఉన్న అశోక్ రెడ్డిని విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఎస్సార్‌న‌గ‌ర్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమ‌వారం విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని చెప్పినా సెల్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

 

 

ఇక అశోక్‌రెడ్డి కాల్ డేటా ఆధారంగా అత‌డు ఎక్క‌డ ఉన్న‌ది తెలుసుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక అశోక్ రెడ్డి సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తాన‌ని చెప్పి శ్రావ‌ణికి ద‌గ్గ‌రై ఆమెను వాడుకున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే అశోక్‌రెడ్డి శ్రావ‌ణి కుటుంబానికి ఆర్థిక సాయం చేయ‌డంతో కూడా ఆమె కుటుంబ స‌భ్యులు అశోక్‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత శ్రావణికి దేవరాజ్ దగ్గర కావడంతో తట్టుకోలేకపోయిన అశోక్‌రెడ్డి సాయికృష్ణతో క‌లిసి ప్లాన్ వేసి వారిద్ద‌రు విడిపోయేలా చేశాడ‌ట‌.

 

 

ఇక శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య‌కు ముందు రోజు అమీర్ పేట శ్రీక‌న్య హోట‌ల్లో శ్రావ‌ణి, దేవ‌రాజ్‌తో గొడ‌వ అనంత‌రం  సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ అశోక్‌రెడ్డితో కలిసి శ్రావణిపై దాడిచేశారు. ఈ దాడిలో అశోక్‌రెడ్డి ప్ర‌మేయం ఎక్కువుగా ఉంద‌ని కూడా పోలీసులు గుర్తించారు. ఏదేమైనా ఈ కేసులో ముందు దేవ‌రాజ్‌, ఆ త‌ర్వాత సాయిపై అనుమానాలు రాగా.. ఇప్పుడు పూర్తిగా అశోక్‌రెడ్డి వైపే ఎక్కువ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news