Politicsకొడాలికి కరెక్ట్ పంచ్ పడింది...గుడివాడ తమ్ముళ్ళు సూప‌ర్

కొడాలికి కరెక్ట్ పంచ్ పడింది…గుడివాడ తమ్ముళ్ళు సూప‌ర్

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో మంత్రి కొడాలి నాని బాగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. వరుసపెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాలపై బూతుల వర్షం కురిపిస్తున్న మంత్రిపై తెలుగు తమ్ముళ్ళు కూడా రివర్స్ అవుతున్నారు. వారు కూడా తగ్గకుండా కొడాలిపై విరుచుకుపడుతున్నారు. నాని అడ్డగోలుగా మాట్లాడితే, టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు.

పైగా అమరావతి ప్రాంతానికి దగ్గరగా ఉండే నాని, అదే అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దనే వాదన తీసుకొస్తున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేని చోట శాసన రాజధాని కూడా వద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు, అమరావతి రైతులు కొడాలిపై ఫైర్ అవుతున్నారు. తాము రాజధాని కోసం భూములు ఇచ్చామని రైతులు గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే ఇళ్ల పట్టల్లో లెక్కలేనంత అవినీతి చేశారని, పైగా చాలాచోట్ల నివాసయోగ్యం కాని భూములు పేదలకు పంచాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

అయితే కొడాలి నాని ఎన్ని బూతులు మాట్లాడినా…ఇంతకాలం గుడివాడ టీడీపీ నేతలు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు సైతం మెదలకుండా ఉన్నారు. కానీ తాజాగా కొందరు టీడీపీ నేతలు కొడాలిపై రివర్స్ అయ్యారు. అమరావతి భూములని ఇళ్ల పట్టాలకు ఇవ్వాలని అడుగుతున్న నాని, తన సొంత పొలం, స్థలాలని పేదలకు ఇళ్ల పట్టాల కింద ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇళ్ల పట్టాల్లో వైసీపీ నేతలు చాలా అవినీతి చేశారని, అందుకే కోర్టులు వాటికి బ్రేకులు వేస్తున్నాయని గుడివాడ తమ్ముళ్ళు గళం విప్పారు. ఇక గుడివాడలో సైతం ఇళ్ల పట్టాల మెరక పనుల్లో నాని అనుచరుల అక్రమాలు ఎక్కువే ఉన్నాయని, ఇంకా బస్టాండ్ అభివృద్ధి కాంట్రాక్ట్‌ని నాని తన బినామీలకే ఇచ్చుకున్నారని ఫైర్ అవుతున్నారు. మొత్తానికైతే చాలాకాలం తర్వాత గుడివాడ తమ్ముళ్ళు నోరు విప్పి కొడాలికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news