Newsబ్రేకింగ్‌: అంత‌ర్వేది ర‌థం ద‌హ‌నం కేసులో ఏపీ స‌ర్కారు షాకింగ్ ఆదేశాలు

బ్రేకింగ్‌: అంత‌ర్వేది ర‌థం ద‌హ‌నం కేసులో ఏపీ స‌ర్కారు షాకింగ్ ఆదేశాలు

తూర్పుగోదావ‌రి జిల్లా స‌ఖినేటిప‌ల్లి మండ‌లం అంతర్వేది రథం దహనం ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు జ‌గ‌న్ స‌ర్కార్‌పై హిందువుల్లో వ్య‌తిరేక‌త పెరిగిపోతోంది. జ‌గ‌న్ సీఎం అయ్యాక వ‌రుస‌గా హిందూ దేవాల‌యాల‌కు సంబంధించిన ఏదో ధ్వంసాలు, విధ్వంసాలు జ‌రుగుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల నుంచి వ‌స్తోన్న తీవ్ర‌మైన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ కేసును సీబీఐకు అప్ప‌గిస్తూ జీవో జారీ చేశారు. జ‌గ‌న్ నిన్న సాయంత్ర‌మే దీనిపై గౌత‌మ్ స‌వాంగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై వెంట‌నే కేంద్ర హోం శాఖ‌కు కూడా లేఖ రాశారు. దీనిపై విచార‌ణ చేయాలంటూ ఏపీ స‌ర్కార్ ఈ రోజు జీవో జారీ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news