Politicsయువ‌తిపై 139 మంది రేప్ కేసులో యాంక‌ర్ ప్ర‌దీప్‌, మాజీ ఎంపీ,...

యువ‌తిపై 139 మంది రేప్ కేసులో యాంక‌ర్ ప్ర‌దీప్‌, మాజీ ఎంపీ, రిపోర్ట‌ర్‌.. సినీ నిర్మాత‌లు

త‌న‌పై ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 139 మంది రేప్ చేశారంటూ ఓ మ‌హిళ పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్లో ఏకంగా వంద పేజీల ఫిర్యాదు ఇచ్చిన విష‌యం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌ల‌క‌లం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసు విష‌య‌మై పోలీసులు కూడా సీరియ‌స్‌గా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కేసు గురించి కొత్త విష‌యాలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఆ 139 మంది త‌న‌పై ఏకంగా 5000 సార్లు లైంగీక దాడికి పాల్ప‌డ్డారంటూ కూడా ఆ యువ‌తి త‌న ఫిర్యాదులో పేర్కొంది.

 

ఇక ఈ లిస్టులోనే యాంక‌ర్ మాచిరాజు ప్ర‌దీప్‌తో పాటు ప‌లువురు బ‌డా బాబులు ఉన్నార‌ట‌. ప్ర‌దీప్‌తో పాటు కొంద‌రు సినీ నిర్మాతలు, ఓ కెమెరామెన్‌, ఓ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ రిపోర్ట‌ర్‌, ఓ మాజీ ఎంపీ, వాళ్ల పీఏతో పాటు ఓ ప్ర‌ముఖ డాక్ట‌ర్ కూడా ఉన్నాడంటూ ఆ యువ‌తి చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో సంచ‌ల‌నంగా మారిన ఈ కేసును పోలీసులు సీసీఎస్‌కు బదిలీ చేశారు. దీంతో ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి వెల్లడించారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news