Newsబ్రేకింగ్‌: ఏపీ రాజ‌ధానిపై స్టేట‌స్ కో పొడిగింపు...

బ్రేకింగ్‌: ఏపీ రాజ‌ధానిపై స్టేట‌స్ కో పొడిగింపు…

ఏపీ హైకోర్టులో రాజ‌ధాని అమ‌రావ‌తి పిటిష‌న్ల త‌ర‌లింపుపై వేసిన ఫిటిష‌న్ల విచార‌ణ‌ను ఈ రోజు విచారించిన హైకోర్టు స్టేట‌స్ కోను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. వ‌చ్చే నెల 21వ తేదీ వ‌ర‌కు ఈ స్టేట‌స్ కోను పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక వ‌చ్చే నెల 21 నుంచి వారం రోజుల పాటు రోజువారి విచార‌ణ కొన‌సాగిస్తామ‌ని కూడా స్ప‌ష్టం చేసింది. ఇక సుప్రీంకోర్టు దీనిపై ఇంత‌కు ముందే స్పందిస్తూ ఈ కేసు హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమ‌ని.. ఈ కేసును హైకోర్టును విచారించాల‌ని స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. కాక‌పోతే సుప్రీంకోర్టు… హైకోర్టు కేసును త్వ‌ర‌గా విచారణ పూర్తి చేయాల‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news