Gossipsరేణుదేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ప‌వ‌న్ ఇరుకున ప‌డిన‌ట్టే...!

రేణుదేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ప‌వ‌న్ ఇరుకున ప‌డిన‌ట్టే…!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప‌వ‌న్‌తో విడిపోయాక మ‌హారాష్ట్రలోని పూణేలో ఉంటోన్న ఆమె గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. రేణు ప్ర‌స్తుతం త‌న పిల్ల‌లు ఆకీరా, ఆద్య‌ల‌తో పూణేలోనే త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటోంది. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు గురించి ఓ సంచ‌ల‌న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమె అల్లు అర‌వింద్‌కు చెందిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ట‌.

ఆహా ప్లాట్ ఫాం నిర్మించే ఓ వెబ్‌సీరిస్‌లో రేణు ముఖ్య‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. ఓ కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించే ఈ వెబ్ సీరిస్ ద్వారానే రేణు డిజిట‌ల్ ప్లాట్ ఫాంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ట‌. ఆహా టీం చెప్పిన క‌థ న‌చ్చ‌డంతోనే  ఈ వెబ్ సీరిస్‌లో న‌టించేందుకు రేణు ఓకే చెప్పార‌ట‌. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ వెబ్ సీరిస్ తెర‌కెక్క‌బోతోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం రేణు మాత్ర‌మే ఎంపికైంద‌ని.. మిగిలిన నటీన‌టుల వివ‌రాలు త్వ‌రలోనే తెలుస్తాయ‌ని అంటున్నారు.

ఇదిలా ఉంటే అల్లు అర‌వింద్‌కు, ప‌వ‌న్‌కు మ‌ధ్య స‌రైన స‌ఖ్య‌త లేద‌న్న‌ది వాస్త‌వం. కొద్ది రోజులుగా వీరిద్ద‌రు స‌రిగా మాట్లాడుకోర‌న్న టాకే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. ఏదో పైపైన ప‌ల‌క‌రింపులు త‌ప్పా వీరికి పెద్ద‌గా పొస‌గ‌ద‌నే మెగా కాంపౌండ్ వీరాభిమానులు కూడా చెవులు కొరుక్కుంటూ ఉంటారు. మ‌రి అలాంటిది ఇప్పుడు అదే అర‌వింద్‌కు చెందిన ఆహా డిజిట‌ల్ ప్లాట్ ఫాంలో రేణు ఓ వెబ్ సీరిస్‌లో న‌టించ‌డం ప‌వ‌న్‌కు కాస్త ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే అవుతుంద‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆహా నిర్మించే వెబ్ సీరిస్‌లో రేణు న‌టిస్తుంద‌న్న వార్త‌లు సోష‌ల్ మీడియాలో లీక్ అయిన‌ప్ప‌టి నుంచి కూడా ప‌వ‌న్ అభిమానుల‌కు ఆమె ఆ సీరిస్‌లో నటించ‌డం ఎంత మాత్రం ఇష్టంలేదు. అందుకే వీరు ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు రూపంలో రేణుకు సూచిస్తున్నారు. మ‌రి ఫైన‌ల్‌గా రేణు డెసిష‌న్ ఎలా ఉంటుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news