Newsబ్రేకింగ్‌: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీకి క‌రోనా పాజిటివ్‌

బ్రేకింగ్‌: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీకి క‌రోనా పాజిటివ్‌

ఏపీలో క‌రోనా ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు క‌రోనా సోకింది. తాజాగా ఈ రోజు వైసీపీకే చెందిన ఇద్ద‌రు ప్ర‌జా ప్ర‌తినిధులు క‌రోనా భారీన ప‌డ్డారు. ఈ రోజు ఉద‌యం తూర్పు గోదావ‌రి జిల్లా కొత్త‌పేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జ‌గ్గిరెడ్డికి క‌రోనా వ‌చ్చింది. ఆయ‌న‌కు క‌రోనా వ‌చ్చింద‌న్న విష‌యం వైర‌ల్ అవుతుండ‌గానే ఈ సారి అదే పార్టీకి చెందిన మ‌రో ఎంపీకి కూడా క‌రోనా వ‌చ్చింది.

జ‌గ‌న్ సోద‌రుడ‌, క‌డ‌ప ఎంపీ వైఎస్‌. అవినాష్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వైఎస్ వర్ధంతి సంధర్భంగా సెప్టెంబర్1,2 వతేదీలలో కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ నేప‌థ్యంలోనే వైఎస్సార్‌సీపీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో పాటు ప‌లువురు అధికారుల‌కు క‌రోనా టెస్టులు చేయించారు. ఈ క్ర‌మంలోనే అవినాష్‌కు క‌రోనా అని నిర్దార‌ణ కావ‌డంతో ఆయ‌న హోం ఐసోలేష‌న్‌కు వెళ్లిపోయారు.

అయితే కొద్ది రోజులుగా ఆయ‌న‌తోనే తిరుగుతోన్న ఆయ‌న అనుచ‌రుల్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. త‌న‌తో కొద్ది రోజులుగా ఉన్న ప్ర‌తి ఒక్క‌రు కూడా క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news