Moviesఆ ఇద్ద‌రు మెగా హీరోలే టార్గెట్ అయ్యారా.. మెగా ఫ్యామిలీలో ఏం...

ఆ ఇద్ద‌రు మెగా హీరోలే టార్గెట్ అయ్యారా.. మెగా ఫ్యామిలీలో ఏం జ‌రుగుతోంది…!

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ మెగా ఫ్యామిలీలోనే మ‌రో ఇద్ద‌రు హీరోల‌ను టార్గెట్ చేసుకున్నాడు. టార్గెట్ చేయ‌డం ఏంట‌నుకోవ‌ద్దు… వారిని బ్యాచిల‌ర్లుగా ఉంచేందుకు చ‌ర‌ణ్‌కు ఎంత మాత్రం ఇష్టం లేద‌ట‌. మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక ఇప్ప‌టికే ఓ ఇంటిది అవుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి పెళ్లికి రెడీగా ఉన్న వారిలో చ‌ర‌ణ్ త‌మ్ముడు వ‌రుణ్‌తేజ్‌, బావ‌మ‌రిది సాయి ధ‌ర‌మ్‌తేజ్ ఉన్నారు. వీరు బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేయ‌డం చ‌ర‌ణ్‌కు ఎంత మాత్రం ఇష్టం లేద‌ట‌.

 

పెళ్లి కాక‌పోవ‌డంతో ఈ ఇద్ద‌రు చరణ్ మాటని పట్టించుకోవడం లేదట‌. ప్ర‌స్తుతం సాయి ధరం తేజ్ 33, వరుణ్ తేజ్ 30 స్టిల్ బ్యాచ్ లర్ గా ఉండటంతో వారు కూడా పెళ్లి చేసుకోవాల‌ని చ‌ర‌ణ్ కోరుతున్నాడు. పెళ్ల‌యితే వీరు కూడా కాస్త ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అవుతార‌ని.. అప్పుడు త‌న‌కు కాస్త స్పందిస్తార‌న్న‌దే చ‌ర‌ణ్ ఉద్దేశం అట‌. మ‌రి ఈ ఇద్ద‌రు మెగా హీరోల పెళ్లి ఎప్పుడు అవుతుందో ? చూడాలి. ఇక సాయికి ఇప్ప‌టికే పెళ్లి సంబంధాలు చూస్తున్నార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news