Newsవర్మ టీట్లపై ‘అలాంటివారిని’ అంటూ ఘాటుగా స్పందించిన చిరు కూతురు

వర్మ టీట్లపై ‘అలాంటివారిని’ అంటూ ఘాటుగా స్పందించిన చిరు కూతురు

After Nagababu, Chiranjeevi and Pawan Kalyan, now Sushmita responds on Ram Gopal Varma comments in an interview.

రాంగోపాల్ వర్మ చాలాకాలం నుంచి మెగాహీరోలను టార్గెట్ చేస్తూ.. ఏదో ఒక వివాదానికి దారితీస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. ‘ఖైదీ’ రిలీజ్‌కి ముందు చిరుని ఉద్దేశించి వర్మ చాలా సెటైర్లు వేశాడు. వాటిపై ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు కానీ.. మెగాఫ్యామిలీ మాత్రం స్పందించలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం ఆ కుటుంబం నుంచి వర్మకు భారీ పంచ్‌లే పడుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా అతనిపై మండిపడుతున్నారు.

ఆమధ్య ‘ఖైదీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వర్మను నాగబాబు తిట్టిపోయగా.. ఆ తర్వాత తన 150వ సినిమా పబ్లిసిటీలో భాగంగా చిరు కూడా అతని కామెంట్స్‌పై స్పందించారు. ఇక పవన్‌ కళ్యాణ్ అయితే గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. తాజాగా చిరు కూమార్తె సుస్మిత కూడా ఆ సంచలన దర్వకుడి ట్వీట్ల మీద ఘాటుగా స్పందించింది. లంచ్ బ్రేక్‌లో మాట్లాడుకోవడానికే తప్ప వర్మ కామెంట్స్ దేనికీ పనికి రావని చెప్పిన ఆమె.. పూర్తిగా మాట్లాడేవారిని సామాజిక మాధ్యమం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని మండిపడింది.

‘వర్మ చేసే కామెంట్స్ కేవలం లంచ్ బ్రేక్‌లో మాట్లాడుకోవడానికే తప్ప ఎందుకూ పనికి రావు. మేము ఖాళీగా ఉండే సమయంలో ఆయన ట్వీట్స్ చూసి నవ్వుకుంటాం. అయినా.. ఒకరి మాటలను మనం నియంత్రంచలేం కదా. ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అలాగని ఎలాపడితే అలా రెచ్చిపోకూడదు. పూర్తిగా నెగిటివ్‌గా మాట్లాడేవారిని సోషల్ మీడియా నుంచి శాశ్వతంగా బ్లాక్ చేయాలి’ అని సుస్మిత చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news