Movies' గుంటూరు కారం ' ఫ‌స్టాఫ్ అలా... సెకండాఫ్ ఇలా...!

‘ గుంటూరు కారం ‘ ఫ‌స్టాఫ్ అలా… సెకండాఫ్ ఇలా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కాంబోలో తెర‌కెక్కుతున సినిమా గుంటూరు కారం షూటింగ్ పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 21 నుంచి వరుసగా మిగిలిన పాటలను షూటింగ్ చేయడంతో షూటింగ్ అంతా పూర్తయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే రూ.160 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక తాజాగా మహేష్ బాబు, శ్రీలీల మీద ఓ మాస్ సాంగ్ షూట్ చేశారు. ఇది సినిమా చివరిలో వస్తుంది.

అలాగే సినిమా ఫస్ట్ ఆఫ్ లో దమ్‌ మసాలా, ఓ మై బేబీ పాటలు వస్తాయి. సెకండ్‌హాఫ్‌లో ఒకే పాట ఉంటుందని.. ఓ సరసర శూలం.. అనే బిట్ సాంగ్‌ను మరికొంచెం పెంచి ఫుల్ సాంగ్ చేశారు.. అది మరీ ఫుల్ సాంగ్ అంత ఉండదు.. కాస్త చిన్నగా ఉంటుందని తెలుస్తోంది. చివరలో మహేష్, శ్రీలీల మీద మాస్ పాట ఉంటుంది. మొత్తం నాలుగు పాటలు అన్న టార్గెట్ ఫినిష్ చేశారు. దమ్‌ మసాలాకు ముందు చిన్న బిట్ ఉంటుంది. వాస్తవానికి ఒక పాట క్యాన్సల్ చేయకుండా ఉంటే ఈ బిట్‌ పెంచాల్సిన అవసరం ఉండేది కాదు.

సినిమా మొత్తం మీద నాలుగు పాటలు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. మాస్ సాంగ్ ఈనెల 30న రిలీజ్ చేస్తారు. గుంటూరు కారం ట్రైలర్ 6న రిలీజ్ చేస్తారు. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో అల్లుకున్న కథతో మాస్ ఎంటర్టైనర్‌గా గుంటూరు కారం సినిమా తెరకెక్కింది. మహేష్ బాబు కి జోడిగా శ్రీలీల‌, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమాకు థ‌మ‌న్‌ స్వరాలు అందించారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఖలేజా తర్వాత 13 సంవత్సరాల క్రితం ఈ సినిమా వస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news