సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేస్తున్నారు కొందరు హీరోలు – హీరోయిన్లు – డైరెక్టర్లు . అయితే తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు కానీ . కొంతమంది స్టార్స్ కూడా అలాగే టంగ్ స్లిప్ అవుతూ ఉండడం గమనార్హం. రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయాడు టాలీవుడ్ డైరెక్టర్ వెంకట్ మహా.
కెజిఎఫ్ మూవీ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే . ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా కొత్త ప్రకంపనలు సృష్టించాయి . కేజీఎఫ్ అనేది ఓ సినిమానా..? రాఖీ బాయ్ ది కూడా ఓ క్యారెక్టర్ నా..? అంటూ తన నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేశారు . దీనిపై చాలా మంది ఆయనపై సీరియస్ అవుతూ ట్రోలింగ్ చేశారు.
మరికొందరు హద్దులు మీరు పోయి ఆయన పర్సనల్ లైఫ్ పై కూడా ట్రోల్ చేశారు , అయితే ఇన్నాళ్లు చూసి చూడనట్లు వదిలేసిన వెంకట్ మహా ఈసారి చాలా చాలా సీరియస్ అయ్యాడు. స్ట్రైట్ గానే ట్విట్టర్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు . “వదిలేస్తే మాట వినరు కదా మీరు ..సరే చెప్తున్నారు వినండి . ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు .. ఏం తీశామన్నది కూడా కాదు ..నేను గర్వంగా చెప్పుకుంటున్నాను.. తెలుగులో గొప్ప సినిమాలు తీశాను ఇంకా తీస్తాను.. ఊరుకుంటున్నాను కదా అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఇకపై ఊరుకోను . ఇలా ట్రోల్ చేసే వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను కేసులు పెడతాను ” అంటూ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది..!!
Vodhilesthe maata vinaru ga meeru. Sare chepthunna vinandi yenni cinemalu theesamanedhi kadhu mukhyam Yem cinema theesaam anedhi mukhyam. Nenu garvamga cheppukuntunnanu I made some of the best films in Telugu and I will make more. Urukuntunnanu kadha ani pichchi pichchi ga… https://t.co/pHwmU4Zsur
— Venkatesh Maha (@mahaisnotanoun) December 11, 2023