Newsనిత్యామీన‌న్‌ను టార్గెట్ చేసిన త్రివిక్ర‌మ్ ఏం చేశాడో తెలుసా... కోప‌రేట్ చేయ‌క‌పోతే...

నిత్యామీన‌న్‌ను టార్గెట్ చేసిన త్రివిక్ర‌మ్ ఏం చేశాడో తెలుసా… కోప‌రేట్ చేయ‌క‌పోతే అంతే గ‌తి…!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్‌తో స్టార్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ కి రెండుసార్లు గొడవ జరిగిందని ఫిల్మ్ సర్కిల్‌లో టాక్ ఉంది. గురూజీ హీరోయిన్‌ను రిపీట్ చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఆయనకి నచ్చాలే హానీ, వరుసగా రెండేసి మూడేసి సినిమాలలో ఛాన్స్ ఇస్తారు. మొహం మొత్తేశాక మరో హీరోయిన్ పట్టుకుంటారు. ఇలియానాకి త్రివిక్రమ్‌ జల్సా, జుల్సా సినిమాలలో ఛాన్స్ ఇచ్చారు.

ఆ తర్వాత సమంతకి అత్తారింటికి దారేది, అ.. ఆ, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలలో ఛాన్స్ ఇచ్చారు. ఇదే సినిమాలో నిత్యా మీనన్ కూడా నటించింది. పూజా హెగ్డేకి అల వైకుంఠపురంలో, అరవింద సమేత చిత్రాలలో అవకాశం ఇచ్చి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టారు. ఇప్పుడు మహేశ్ బబౌతో తెరకెక్కిస్తున్న గుంటూరు కారంలోనూ పూజా నటించాల్సి ఉంది. కానీ, గురూజీ కన్ను శ్రీలీల మీద పడింది. మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరీ చేస్తుంది.

ఈ మధ్యలో త్రివిక్రం శ్రీనివాస్ బాగా కనెక్ట్ అయిందీ అంటే సంయుక్త మేనన్. ఈ మలయాళం భామకి ఆయన సిఫార్సు బాగా ఉంది. ఇప్పుడిప్పుడే ఆమె మీద కూడా బోర్ కొట్టిందనే టాక్ వినిపిస్తోంది. అయితే, భీమ్లా నాయక్‌ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జంటగా నటించిన నిత్యా మీనన్ అంటే గురూజీ బాగా కోపం అని టాక్ ఉంది. నిత్యా ఏ సినిమా ఒప్పుకున్నా తన క్యారెక్టర్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాదు.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా సమయంలోనే నిత్యా మీనన్ తన క్యారెక్టర్ విషయంలో త్రివిక్రం కి సలహాలిచ్చిందట. అది నచ్చక ఇద్దరికీ గొడవ జరిగిందని చెప్పుకున్నారు. భీమ్లా నాయక్‌ సినిమా సమయంలోనూ అదే జరిగిందట. కొన్ని విష‌యాల్లో త్రివిక్ర‌మ్ డామినేష‌న్‌ నిత్యా ఒప్పుకోలేదని, దాంతో ఈ మూవీలో చిత్ర గారు పాడిన అంత ఇష్టం ఏందయ్యా అనే సాంగ్ ని నిత్యాకి సంబంధించిన కొన్ని సీన్స్‌ని త్రివిక్రం కావాలని తొలగించేసినట్టు టాక్ ఉంది. సాంగ్ తీసేయడానికి థమన్ కూడా కారణం అంటుంటారు. ఏదేమైన దర్శకనిర్మాతలకి సపోర్ట్ చేయకపోతే హీరోయిన్ గతి ఇంతే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news