Newsఅత‌డి కోరిక తీర్చ‌నందుకే అలా చేశాడు ... డైరెక్ట‌ర్‌పై హీరోయిన్ సంచ‌ల‌న...

అత‌డి కోరిక తీర్చ‌నందుకే అలా చేశాడు … డైరెక్ట‌ర్‌పై హీరోయిన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

కాంట్రవర్సీ హీరోయిన్గా ముద్ర వేసుకున్న నటి మనీషా యాదవ్. తమిళ అమ్మాయి అయిన మనీషా యాదవ్ తమిళ దర్శకత్వం వహించిన వళ‌క్కు ఎన్ 18/9 సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా వర్ కుప్పం కాద‌ల్‌తో పాటు కొన్ని సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే దర్శకుడు శీను రామస్వామి తన ఇద‌మ్ పొరుల్ యావల్ సినిమాలో ఆమెను హీరోయిన్గా ఎంపిక చేశారు.

అయితే కొద్ది రోజులకే ఈ సినిమా నుంచి ఆమెను తొలగించారు. ఆమె సహకరించటం లేదని తనను బాగా ఇబ్బందులకు గురి చేస్తుందని డైరెక్టర్ రామస్వామి ఆరోపించారు. అయితే ఈ సినిమా సమయంలో నటి మనిషా యాదవ్ పై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని.. దర్శకుడు శ్రీను రామస్వామి పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె స్థానంలో మరో హీరోయిన్ నందిత శ్వేత నటించారు. ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు.

ఇటీవల మరోసారి రామస్వామి తన సినిమాలో మనీషా యాదవ్‌ను హీరోయిన్గా తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై మనిషా స్పందించింది. అలాంటి డైరెక్టర్లతో సినిమాలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కొద్ది రోజుల క్రితం శీను రామస్వామి ఆఫీస్ నుంచి నాకు కాల్‌ వచ్చింది.. ఆయన కొత్త సినిమాలో నటిస్తావా అని అడిగారు.. తాను అస్సలు నటించన‌ని మొహం మీదే చెప్పేసా. గ‌తంలో ఓ మూవీ సమయంలో ఆయన ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉందని వాపోయింది.

తనను తప్పుడు ఉద్దేశంతో తాగేందుకు చాలాసార్లు ట్రై చేశాడని.. కానీ నేను ఆయన కోరికలు అంగీకరించకపోవడంతో నన్ను బలవంతంగా సినిమా నుంచి తప్పించాడు.. నాకు నటించడం తెలియదని తప్పుడు ప్రచారం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తను చాలామంది పెద్దదర్శకులతో పనిచేశానని.. అయితే ప్రతిభ ఉన్నా.. ఇలాంటి మానవత్వం లేని దర్శకుల సినిమాలలో నటించాల్సిన అవసరం తనకు లేదని.. కుండబద్దలు కొట్టేసింది.

తనకు మంచి భర్త, కుటుంబం, సన్నిహితులు ఉన్నారని నటి మనిషా యాదవ్ పేర్కొంది. నాలాంటి కొత్త హీరోయిన్లకు ఇలాంటి చెడ్డ అనుభవాలు ఎప్పుడు ఎదురు కాలేదని కూడా వాపోయింది. ప్రస్తుతం మనిషా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news