Moviesచరణ్-సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలిస్తే.. జుట్టు...

చరణ్-సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలిస్తే.. జుట్టు పీక్కుంటారు ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ .. ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు. ఆయన లాస్ట్ గా నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలోని రామ్ చరణ్ కి సంబంధించిన ప్రతి న్యూస్ గ్లోబల్ స్థాయిలో వైరల్ అవుతుంది. రీసెంట్ గానే ఓ పాపకు తండ్రి అయిన రాంచరణ్.. త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడు .

ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు రామ్ చరణ్ . ఇలాంటి క్రమంలోనే గతంలో రాంచరణ్ హిట్ సినిమాను వదులుకున్నాడు అన్న ప్రచారం ఊపందుకుంది. ఆ సినిమా మరేదో కాదు ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా. ఈ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్ కన్నా ముందు శేఖర్ కమ్ముల రామ్ చరణ్ తేజ్ ను అనుకున్నారట.

హీరోయిన్గా సాయి పల్లవి అంటూ ఫిక్స్ అయిపోయిన శేఖర్ కమ్ముల .. హీరో విషయంలో మాత్రం రామ్ చరణ్ తో పాటు పలువురు స్టార్ హీరోలను అప్రోచ్ అయ్యారట. అయితే ఎవరు కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ కధ కావడం తో .. హీరో కన్నా హీరోయిన్ కి ప్రాధాన్యత ఎక్కువ ఉండడంతో సినిమా రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఫైనల్లీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాను ఒప్పుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు . అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాయి పల్లవి కాంబోలో మంచి సినిమా మిస్ అయినట్లయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news