Movies"ఇండస్ట్రీలో చిరంజీవి కంటే దురదృష్టవంతుడు మరెవ్వరు లేరు".. తెలుగు డైరెక్టర్ షాకింగ్...

“ఇండస్ట్రీలో చిరంజీవి కంటే దురదృష్టవంతుడు మరెవ్వరు లేరు”.. తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ విషయాన్ని అయినా సరే భూతద్దం లో పెట్టి చూడడం చాలా కామన్ గా మారిపోయింది . ఓ స్టార్ సెలబ్రిటీకి సంబంధించిన విషయాలు ఇట్టే ట్రెండ్ అయిపోతున్నాయి . కాగ రీసెంట్గా బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన సాయి రాజేష్.. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

కాగ ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా బేబీ . జులై 14న ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడమే కాకుండా ..ఏకంగా 75 కోట్లు కలెక్ట్ చేసి సినిమా ఇండస్ట్రీలో చెరగని రికార్డులు నెలకొల్పింది. ఈ క్రమంలోనే ఈ సినిమా హిట్ అవ్వడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు మేకర్స్.

ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఇన్వైట్ చేశారు . కాగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కి వచ్చి వైష్ణవి చైతన్య ని ఓ రేంజ్ లో పొగిడేసారు. అయితే అనంతరం స్టేజి పైకి వచ్చిన సాయి రాజేష్ మాట్లాడుతూ ..”చిరంజీవి ఓ దురదృష్టవంతుడిని షాకింగ్ కామెంట్స్ చేశారు”. ఇది విన్న ఒక్క నిమిషం అభిమానులు కోపంతో ఊగిపోయారు. అయితే ఆ తర్వాత మ్యాటర్ తెలుసుకొని కూల్ అయ్యారు .

“చిరంజీవి ఆయనకు ఆయన అభిమానిలా ఉండలేడు. ఆయనకు అభిమానిలా ఉండే అదృష్టం ఆయనకు లేనేలేదు ..మాకు జ్వరం వచ్చిన.. తలనొప్పి వచ్చిన బాధ వచ్చిన హ్యాపీ వచ్చిన మా మందు పారాసిట్మాల్ ఆయన పాటే” అంటూ ఆయనపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చాడు . అయితే ఇది చెత్త ఎగ్జాంపుల్ గా భావిస్తున్నారు మెగాస్టార్ ఫ్యాన్స్ . ఇలా ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారా బాసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news