Moviesబ్రతికున్నప్పుడు చేయలేని పని .. శ్రీదేవి చనిపోయిన ఇన్నాళ్లకు చేసాడు.. బోనీ...

బ్రతికున్నప్పుడు చేయలేని పని .. శ్రీదేవి చనిపోయిన ఇన్నాళ్లకు చేసాడు.. బోనీ కపూర్ పై కొత్త డౌట్లు..!?

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న బోనీకపూర్ హీరోయిన్ శ్రీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే . అయితే శ్రీదేవి దుబాయ్ లో ఓ హోటల్లో బాత్రూంలో అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. ఇప్పటికీ దీనిపై పలు అనుమానాలు ఉన్నాయి.

కానీ ఆన్సర్ ఇచ్చే వాళ్లు లేరు. ఇలాంటి క్రమంలోనే శ్రీదేవి భర్త బోనీ కపూర్ పై రకరకాల డౌట్లను వ్యక్తం చేశారు ఆమె అభిమానులు. మరోసారి శ్రీదేవి భర్త బోనికపూర్ పై అలాంటి డౌట్లని వ్యక్తం చేస్తున్నారు శ్రీదేవి అభిమానులు. దానికి కారణం శ్రీదేవి డ్రీమ్ ని రీసెంట్గా ఫుల్ ఫీల్ చేయడమే . శ్రీదేవి 80 ‘స్ లో ఫుల్ జోష్ మీద ఉన్న సమయంలో చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో ఈస్ట్ కోస్ట్ రోడ్డులో బీచ్ దగ్గర ఐదు ఎకరాల ప్రాపర్టీ కొనుగోలు చేసింది . దాని విలువ కోట్లలోనే ఉంటుంది . బీచ్ ప్లేస్ లో డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఆమె ఎప్పటి నుంచి కలగనేది .

అయితే ఆమె బ్రతికున్నప్పుడు అది వద్దు అంటూ బోనీకపూర్ ఎప్పటినుంచో వాయిదా వేస్తూ వచ్చారు . అయితే ఆమె చనిపోయిన తర్వాత ఆమె తీరని కోరిక కావడంతో ఆ కలని నెరవేర్చాడు బోనీకపూర్. తన సతీమణి చిరకాల కోరికలు ఆమె భర్త బోనికపూర్ నెరవేర్చారు . శ్రీదేవి చనిపోయిన ఐదేళ్ల తర్వాత తాజాగా గ్రూప్ పార్టనర్ షిప్ హోటల్ గా అభివృద్ధి చేశారు . దీని గురించి బోనీకాపూర్ మాట్లాడుతూ..”ఇది శ్రీదేవి కల ..శ్రీదేవి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఫుల్ ఫిల్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది . ఈ పని చేయడానికి రెండేళ్లుగా డెవలప్మెంట్ పనులు చేపట్టి మరీ కష్టపడుతున్న .. ఫైనల్ గా నా భార్య కోరిక తీరిపోయింది” అంటూ చెప్పుకొచ్చాడు . అయితే పలువురు శ్రీదేవి మరణానికి కారణం బోనీకపుర్ అంటూ అనుమానం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . శ్రీదేవి దుబాయ్ కి వెళ్లే ముందు బోనీకపూర్ తో గొడవలు అయ్యాయట . ఆ కారణంగానే ఆయన ఆమెను బాత్రూంలో తోసేసి ఉండొచ్చు అంటూ జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . అయితే శ్రీదేవి చనిపోయే సమయానికి బోనీకపూర్ ఇండియాలో ఉండడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news