Moviesఆ స్టార్ హీరో తో బాలయ్య మల్టీ స్టారర్.. దీనమ్మ ఇక...

ఆ స్టార్ హీరో తో బాలయ్య మల్టీ స్టారర్.. దీనమ్మ ఇక బాక్స్ ఆఫిస్ బద్ధలైపోవాల్సిందే..!!

టాలీవుడ్ నరసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా వీరసింహారెడ్డి . ఈ సినిమాలో శృతిహాసన్ -హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు . ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ పాత్రలో మెరిశారు. అంతే కాకుండా బాలయ్య కెరియర్ లోనే టాప్ కలెక్షన్స్ సాధించిన వన్ ఆఫ్ ద బిగ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది వీర సిమ్హా రెడ్డి.

అయితే ప్రెసెంట్ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” అనే సినిమా చేస్తున్న బాలయ్య ..ఈ సినిమా అయిపోగానే మెగా డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమాకి కనెక్ట్ అయ్యాడు . ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ – నయనతారలు హీరోయిన్లుగా సెలెక్ట్ అయినట్టు ప్రచారం జరుగుతుంది . అయితే ఈ సినిమాలో మరో తెలుగు హీరో కూడా ఉన్నాడని.. ఆ హీరో నెగటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నారని సినీ వర్గాలల్లో ఓ న్యూస్ తెగ హల్ చల్ చేస్తుంది.

టాలీవుడ్ మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ ఈ సినిమా లో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. బాలకృష్ణకు రవితేజ ఎంత పెద్ద వీర అభిమాని అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ క్రమంలోనే ఆయనపై ఉండే అభిమానంతో ఆయనతో ఒక్క సినిమాలో అయినా నటించాలని అనుకున్నారట. ఆల్రెడి బాబీ తో వాల్తేరు వీరయ్య సినిమాలో నటించడంతో బాబి – రవితేజల మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగా కుదిరింది. ఈ క్రమంలోనే ఆయన ఈ సినిమాలో ఈ పాత్ర కోసం రవితేజను చూస్ చేసుకున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇద్దరు మాస్ హీరోలను తెర పై ఒక్కేసారి చూస్తే ఎలా ఉంటాది.. అభిమానులకి పండగే పండగా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news