Moviesహీరోయిన్ అందంగా కనిపించాలి అని.. ఐదు లీటర్ల పాలతో స్నానం చేయించిన...

హీరోయిన్ అందంగా కనిపించాలి అని.. ఐదు లీటర్ల పాలతో స్నానం చేయించిన స్టార్ డైరెక్టర్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గ్లామర్ గా లేకపోతే అస్సలు చూడరన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొందరు డైరెక్టర్లు హీరోయిన్స్ ని మరింత అందంగా తెరపై చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు . అలాంటి వాళ్ళల్లో దర్శకుడు ముందు వరుసలో ఉంటారని చెప్పాలి . తన సినిమాలో హీరోయిన్స్ ని ఎంత నేచురల్ గా ఎంత అందంగా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే రీసెంట్గా ఆయన నటించిన పోనియన్ సెల్వన్ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్యను – హీరోయిన్ త్రిషను ఎంత అందంగా చూపించారో మనకు తెలిసిందే.

ముట్టుకుంటే కందిపోతుందా..? అన్నంత రేంజ్ లో సున్నితంగా ఉన్న లేలేత గులాబీ రేకుల వంటి అట్రిక్టివ్ అందాలను వాళ్ళకి సొంతమయ్యేలా చేశారు. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు మణిరత్నం వాళ్ళిద్దరిని షూటింగ్ కి రెండు రోజులు ముందు నుంచి ఐదు లీటర్ల పాలతో స్నానం చేయించే వారట . ఆ పాలల్లో కుంకుమపువ్వు కూడా కలిపే వారట. అందుకే సినిమాలో ఆ విధంగా మెరిసిపోయారని ..

మరి ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ కన్నా త్రిషపై త్రిష అందంపై చాలా కాన్సన్ట్రేషన్ చేశారని.. అందుకే కుందవై దేవి పాత్రలో త్రిష అందంగా చక్కగా కనిపించిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు హీరోయిన్స్ అందంపై దర్శకుడు కి ఉన్న కాన్సన్ట్రేషన్ చూసి జనాలు ఆశ్చర్య పోతున్నారు. మొత్తానికి దర్శకుడు మణిరత్నం చాలా చాలా మొండి వాదు అనుకున్నది సాధిస్తాడు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news