Newsపాన్ ఇండియా హీరో ప్రభాస్ తో బ్రేకప్.. లీగల్ నోటీసులు పంపిన...

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో బ్రేకప్.. లీగల్ నోటీసులు పంపిన స్టార్ హీరోయిన్..!!

టాలీవుడ్ ఇండస్ట్రిలో రెబల్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎలా జెట్ స్పీడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడో మనకు తెలిసిందే. ఇప్పటికే సలార్ , ప్రాజెక్టుకె లాంటి బడా సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాల తర్వాత నటించే ప్రభాస్ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతూ ఉండడం గమనార్హం.

అయితే ఇలాంటి క్రమంలోనే ఆయన రీసెంట్గా నటించిన సినిమాలోని హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా బాలీవుడ్ మీడియాలో ప్రతిసారి ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అంతేకాదు బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు ఏకంగా కృతి సనన్ తో ప్రభాస్ ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిందంటూ ఓసారి ట్విట్ చేసి .. ఆ తర్వాత కృతి సనన్- ప్రభాస్ విడిపోయారు అంటూ బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ ట్విట్ చేశారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కృతిసనన్ చెప్పినా కానీ ఉమర్ సైంధు .. ఇలా ప్రతిసారి ప్రభాస్ తో తన పేరును ట్యాగ్ చేసి బ్రేకప్ అని రాయడం .. ట్విట్ చేయడం తనకు ఇబ్బందికరంగా ఉందని ఈ క్రమంలోనే అతగాడికి లీగల్ నోటీసులు పంపిస్తూ కృతి సనన్ సంచలన నిర్ణయం తీసుకుంది . అయితే కృతి సనన్ పంపించిన నోటీసులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “లోల్” అంటూ రాసుకువచ్చాడు ఉమర్ సైంధు. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నందుకు ఉమర్ సైంధు కు డిఫమేషన్ నోటీసులు పంపించింది కృతి సనన్. దీంతో ఇంటర్నెట్లో అవి కాస్త వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news