Newsవెస్ట్‌లో ' బ్రో ' కు బిగ్ షాక్‌… బుకింగ్‌ల్లేవ్‌… ప‌వ‌న్...

వెస్ట్‌లో ‘ బ్రో ‘ కు బిగ్ షాక్‌… బుకింగ్‌ల్లేవ్‌… ప‌వ‌న్ ఫ్యాన్స్‌లో ఆందోళ‌న‌..!


ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా బ్రో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రికొద్ది గంట‌ల టైం మాత్ర‌మే ఉంది. టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం చూడ‌ద‌గ్గ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో మరో ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రమే “బ్రో”. యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో న‌టిస్తుండ‌డంతో పాటు కోలీవుడ్ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో మంచి అంచ‌నాలు ఉన్నాయి

అయితే ఈ సినిమాకు వెస్ట్ గోదావ‌రిలో పెద్ద దెబ్బ‌ప‌డిపోయేలా ఉంది. సినిమా రిలీజ్‌కు మ‌రి కొద్ది గంట‌ల టైం మాత్ర‌మే ఉంది. ఇలాంటి టైంలో కూడా ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్‌లు ఓపెన్ కాలేదు. మ‌రోవైపు నైజాంలో నిన్నే అడ్వాన్స్ బుకింగ్‌లు ఓపెన్ కాగా.. ఫ‌స్ట్ డే అన్ని ఫుల్స్ ప‌డ్డాయి. ఇటు విజ‌య‌వాడ‌లోనూ అడ్వాన్స్ బుకింగ్‌లు ఓపెన్ కాగా ఫ‌స్ట్ డే దాదాపు 95 %కు పైగా ఫుల్స్ ప‌డుతున్నాయి.

ఇంకా వెస్ట్‌లో మాత్రం అస‌లు అడ్వాన్స్ బుకింగ్‌లే స్టార్ట్ కాలేదు. అస‌లు సింగిల్ స్క్రీన్లే కాదు.. మల్టీఫ్లెక్స్‌ల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్‌లు పెట్ట‌లేదు. దీంతో ప‌వ‌న్ అభిమానులు బాగా డిజ‌ప్పాయింట్ అవుతున్నారు. వీళ్లంతా ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో త‌మ అభిమాన హీరో సినిమా చూడాల‌న్న ఆతృత‌తో ఉంటే అస‌లు ఇంకా ఇక్క‌డ బుకింగ్స్ ఓపెన్ కాక నిరుత్సాహంతో ఉన్నారు.

ఈ ప్ర‌భావం ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ మీద గ‌ట్టిగా ప‌డుతుంద‌ని కూడా ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్ప‌ట‌కి అయినా నిర్మాత వెంట‌నే డిస్ట్రిబ్యూట‌ర్‌తో చ‌ర్చించి వెస్ట్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లు స్టార్ట్ అయ్యేలా చూడాల‌ని ఫ్యాన్స్ కోరుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news