News"ఆ చేదు జ్ఞాపకానికి ..నా జీవితంలో ఏడాది".. సమంత ఎమోషనల్ పోస్ట్...

“ఆ చేదు జ్ఞాపకానికి ..నా జీవితంలో ఏడాది”.. సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత – నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకునే ఈ జంట పట్టుమంటూ పది కాలాలపాటు కాపురం చేసుకోకుండానే విడాకులు తీసేసుకుంది . దానికి మెయిన్ రీజన్ వీళ్లిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలే కారణం . కాగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన లైఫ్ ముందుకు తీసుకెళ్తున్న టైం లో చాలా రేర్ డిసీజ్ మయోసైటిస్ కి గురైంది . ఈ టైంలో ఆమె చాలా డిప్రెషన్ కి లోనైంది.

కాగా ఈ మయోసైటిస్ ఆమెకి వచ్చి జూన్ 15 కు ఏడాది కావడంతో ఆమె దీనికి సంబంధించిన ఎమోషనల్ పోస్ట్లు ను షేర్ చేసింది. దీనితో ఆ రోజులను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకునింది. ” నాకు ఈరోజుతో మయో సైటిస్ వ్యాధి నిర్ధారణ అయ్యి ఏడాది అయింది. ఎంతో ఫోర్స్ గా కొత్త సాధారణ జీవితానికి వచ్చాను . నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు .. నా శరీరంలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో.. ఈ ఏడాది నేను ఎంత కష్టపడ్డాను అనేది నాకు బాగా తెలుసు .”

“ఉప్పు-చక్కెర-ధాన్యాలు మెయిన్ కోర్స్ కోసం కూడిన మందులు బలవంతంగా మింగించారు . బలవంతంగా ట్రీట్మెంట్ తీసుకున్నాను . ఈ శక్తి నుండి ఈ వ్యాధి నుండి నేను కోలుకోవడానికి డాక్టర్స్ నాకు ఎంత సహాయపడ్డారు . మీ అందరి ప్రార్థన- పూజలు వల్లే నేను ఇంత త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడగలిగాను” అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది . అంతేకాదు అన్నివేళలా అన్ని నీ మార్గంలో జరగవని నాకు నేర్పిన సమస్తం . మరీ ముఖ్యంగా అది లేనప్పుడు నేను నియంత్రించతగిన వాటిని నియంత్రించాలి. మిగిలిన వాటిని వదిలేయాలి” అంటూ నేర్పింది . ఈ మయోసైటిస్ నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది ” అంటూ చాలా ఎమోషనల్ గా స్పందించింది. దీంతో ఈ ఎమోషనల్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news