Moviesవిరూపాక్ష: లేటుగా వచ్చి గుణపం దించేసిన సాయి ధరమ్ తేజ్.. ఫస్ట్...

విరూపాక్ష: లేటుగా వచ్చి గుణపం దించేసిన సాయి ధరమ్ తేజ్.. ఫస్ట్ డే కలెక్షన్స్..!

సాయి ధరంతేజ్.. సుప్రీం హీరో గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ మెగా మేనల్లుడు అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. కానీ ఊహించినంత స్థాయిలో కమర్షియల్ సక్సెస్ లు అయితే సొంతం చేసుకోలేదని చెప్పాలి. ఇకపోతే చివరిసారిగా రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరంతేజ్ ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించలేకపోయాడు. ఇక దాదాపు రెండు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే విరూపాక్ష .. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుం. ది కొత్త డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో సంయుక్తమేనన్ హీరోయిన్ గా నటించింది.

అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచిందని చెప్పాలి. ఇక శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఇందులో రాజీవ్ కనకాల , సునీల్, సాయి చంద్ర, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.. ఇక ఏప్రిల్ 21వ తేదీన భారీ అంచనాల మధ్య తెలుగులో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఏమేరా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టింది అనే విషయం ఇప్పుడు చూద్దాం..

నైజాం – రూ.1.82 కోట్లు
వైజాగ్ – రూ. 58 లక్షలు
సీడెడ్ – రూ.54 లక్షలు
గుంటూరు – రూ.46లక్షలు
నెల్లూరు – రూ.20లక్షలు
కృష్ణ – రూ.32లక్షలు
వెస్ట్ – రూ.47లక్షలు
ఈస్ట్ – రూ.40లక్షలు

మొత్తం – రెండు తెలుగు రాష్ట్రాలలో కలుపుకొని రూ. 4.79 కోట్లు మేరా షేర్ రాబట్టింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి రోజే ఈ మేర కలెక్షన్ సాధించింది అంటే ఇక తదుపరి రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news