Moviesవామ్మో..బాలయ్య నోట ఆ మాట.. ఫ్యాన్స్ అస్సలు ఊహించలేదుగా..!!

వామ్మో..బాలయ్య నోట ఆ మాట.. ఫ్యాన్స్ అస్సలు ఊహించలేదుగా..!!

ప్రజెంట్ బాలయ్య ఫ్యాన్స్ ఏ రేంజ్ లో హ్యాపీగా ఉన్నారో ప్రత్యేకించి చెప్పిన అవసరం లేదు. ఇన్నాళ్లుగా ఊరించి ఊరించి ఎట్టకేలకు థియేటర్స్ లో వీరసింహారెడ్డి సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్ . కాగా ఫస్ట్ నుంచి ఈ సినిమాపై పెట్టుకున్న భారీ అంచనాలను ఏమాత్రం తగ్గనీకుండా ..దానిని ఢబుల్ కాదు ట్రిపుల్ చేస్తూ గోపీచంద్ నందమూరి ఫ్యాన్స్ ను ఫుల్ సాటిస్ఫై చేశారు . సంక్రాంతికి రియల్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా అన్ స్టాపబుల్ షో స్పెషల్ ఎపిసోడ్ కి వీరసింహారెడ్డి టీం గెస్ట్లుగా వచ్చారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన విజయ్ దునియా.. లేడీ విలన్ రోల్ లో కనిపించిన వరలక్ష్మి శరత్ కుమార్.. సెకండ్ హీరోయిన్గా నటించిన హనీ రోజ్.. అందరూ ఈ షో కి వచ్చి ఎంటర్టైన్ చేశారు . ఈ క్రమంలోనే బాలయ్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ క్రమంలోనే బాలయ్య.. గోపీచంద్ తో మాట్లాడుతూ ..” నన్ను బాగా పిండేశావ్ గా” అంటూ మాట్లాడుతాడు. నిజానికి ఎంతటి కష్టనైనా భరించే సత్తా బాలయ్యకు ఉంది .. అలాంటి బాలయ్య నే పిండేశాడు అంటే..ఈ సినిమా హిట్ కొట్టడానికి ఎంత ట్రై చేసాడో గోపీ ..ఎంత కసిగా డైరెక్ట్ చేసాడో అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే సినిమాలో కొన్ని కొన్ని పవర్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ బాలయ్య నోటి నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నరకడం మొదలెడితే ఏ పార్ట్ ఎవరిదో మీ పెళ్ళాలు కూదా గుర్తుపట్టలేరు.. అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్..సినిమాకే హైలెట్ గా మారింది. నిజానికి బాలయ్య నోటి నుండి ఇలాంటి డైలాగులు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.. కానీ వింటుంటే మాత్రం అదోరకమైన మజా వస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news