Moviesమ‌హేష్‌తో కాపురం చేసేందుకు న‌మ్ర‌త పెట్టిన సింగిల్ కండీష‌న్ ఇదే... ఆ...

మ‌హేష్‌తో కాపురం చేసేందుకు న‌మ్ర‌త పెట్టిన సింగిల్ కండీష‌న్ ఇదే… ఆ చిన్న కోరిక ఇదే…!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. ఒకప్పుడు మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న నమ్రత.. ఆ తర్వాత మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో హీరోయిన్ అయింది. మహేష్ మంజరేకర్, సంజయ్ దత్ లాంటి స్టార్ల‌తో కలిసి నటించిన నమ్రత అప్పట్లో హాట్ హాట్ గా కనిపించేది. నమ్రత అంటే బాలీవుడ్లో ఒక సెన్సేషన్.

నమ్ర‌త‌ సోదరి శిల్ప శిరోద్క‌ర్‌ కూడా బాలీవుడ్లో పలు సినిమాలలో నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగులో మోహన్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మ సినిమాలోని కనిపించింది. ఇక బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా నటించిన నమ్రత… ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంజి సినిమాలోని మెగాస్టార్ చిరంజీవికి జోడిగా కనిపించింది.

వంశీ సినిమా టైంలో మహేష్ బాబుతో ప్రేమలో పడిపోయిన నమ్రత ఐదేళ్ల ప్రేమ తర్వాత 2005లో పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయ్యింది. ఒకటి మాత్రం నిజం. నమ్ర‌త‌ను పెళ్లి చేసుకున్నాక మహేష్ బాబు కెరీర్ లో వ్యక్తిగతంగాను, కెరీర్ పరంగాను చాలా మార్పులు వచ్చాయి. మహేష్ ను నమ్రత చాలా మార్చేసింది అని కూడా అంటారు. అలాగే మహేష్ కెరీర్ కు నమ్రత తెర వెనక అన్ని తానై నడిపిస్తూ ఒక వెన్నుదన్నుగా ఉంటుంది అన్నది కూడా నిజం.

ఇక పెళ్లికి ముందే అన్ని షూటింగులు పూర్తి చేయడానికి మహేష్ బాబు కోసం తాను రెండేళ్లకు పైగా ఎదురు చూశానని కూడా నమ్రత తన తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. అలాగే మహేష్ తో పెళ్లికి ముందు కూడా తాను ఓ కండిషన్ పెట్టానని… తాను ముంబైలో పెరిగినందున పెద్ద ఇంట్లో నివసించటం సౌకర్యంగా లేదని చెప్పడంతో మహేష్ తన కోసమే అపార్ట్మెంట్లోకి మారాడు అని కూడా నమ్రత చెప్పింది.

ఇక నటన నుంచి తప్పుకున్నందుకు తనకు ఎలాంటి బాధ లేదని చెప్పిన నమ్రత… తన తల్లి కోరిక మేరకే తాను మోడలింగ్ ప్రారంభించామని చెప్పింది. తాజాగా నమ్రత ఇచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news