Moviesఏమాయ చేసావే సినిమాలో మొదట హీరోగా అనుకున్నిందో ఎవరినో తెలుసా..ఎందుకు రిజెక్ట్...

ఏమాయ చేసావే సినిమాలో మొదట హీరోగా అనుకున్నిందో ఎవరినో తెలుసా..ఎందుకు రిజెక్ట్ చేసారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

గౌతమ్ మీనన్ డైరెక్షన్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా “ఏం మాయ చేసావే” ఈ సినిమా వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సునామీ సృష్టించింది . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సింపుల్గా సాదాగా థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా నటించగా.. అందాల భామ సమంత ఈ సినిమాతో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయింది . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది.

అంతేకాదు ఈ సినిమాలోని ప్రతి సీన్.. ప్రతి మ్యూజిక్ ..ప్రతి డైలాగ్.. యువతను ఎంతగానో ఉర్రూతలూగించింది. మరీ ముఖ్యంగా నాగచైతన్య సమంత మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ అయితే థియేటర్స్ చూసిన జనాలు పిచ్చెక్కిపోయారు. అంతలా ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. అయితే రీసెంట్ గా గౌతమ్ మీనన్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే “ఏం మాయ చేసావే సినిమా” స్క్రిప్ట్ రాసుకునే టైం లో హీరోగా గౌతమ్ మీనన్ ముందుగా అనుకున్నింది మహేష్ బాబు నట.

ఎస్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని గౌతమ్ మీననన్ ఊహించుకుని “ఏం మాయ చేసావే” సినిమాలో హీరోగా పెట్టాలనుకున్నారట. ఈ స్టోరీ కూడా మహేష్ బాబుకు చెప్పారట. కానీ అప్పటికే ఆయన పోకిరి సినిమా భారీ విజయాన్ని అందుకున్న క్రమంలో క్లాస్ కాకుండా మాస్ సినిమా చేయాలని మహేష్ బాబు అనుకోవడంతో ఈ సినిమాను వదులుకున్నాడట . ఇక ఆ తర్వాత ఈ సినిమా స్టోరీ నాగచైతన్యకు చెప్పగా నాగార్జున వెంటనే ఓకే చేశారని ఆ తర్వాత సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేటర్స్ లోని రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సాధించిందని గౌతమ్ మీనన..” చెప్పుకొచ్చాడు. అంతేకాదు త్వరలోనే “ఏం మాయ చేసావే 2” కూడా తెరకెక్కించబోతున్నట్లు చెప్పారు. మరి చూడాలి దీంతో హీరో హీరోయిన్లుగా సమంత నాగచైతన్య నటిస్తారో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news