Moviesవావ్: అలియా భట్ కి ఢబుల్ ప్రమోషన్స్..మరో గుడ్ న్యూస్ షేర్...

వావ్: అలియా భట్ కి ఢబుల్ ప్రమోషన్స్..మరో గుడ్ న్యూస్ షేర్ చేసిన రణబీర్..!!

బాలీవుడ్ స్టార్ కిడ్స్ కమ్ సెలబ్రిటీస్ రణబీర్ కపూర్..అలియా భట్ గురించి ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు. పుట్టుకుతోనే గోల్డెన్ స్పూన్ పట్టుకున్న ఈ ఇద్దరు..ఆ తరువాత కూడా వాళ్ళ లైఫ్ అంతా రిచ్ గానే బ్రతికేస్తున్నారు. వారసత్వం పేరుతో సినిమాల్లోకి వచ్చి..హవ్వా చాటుతున్నారు. ఇద్దరు సినీ రంగంలో టాప్ పోజీషన్ల్ లో ఉన్నారు. వరుస బిగ్ ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టి కెరీర్ ని మంచి ఫాంలో ఉంచుతున్నారు.

గత కొంతకాలంగా లవ్ లో మునిగి తేలిన ఈ లవ్ బార్డ్స్..ఇప్పుడు అఫిషీయల్ భార్య భర్తలుగా మారిపోయారు. ఏం చేసిన ఇప్పుడు అఫిషీయల్ నే..అందుకే పెళ్ళై రెండు నెలలు కాకముందే..అలియా ప్రెగ్నెంట్ అంటూ గుడ్ న్యూస్ చెప్పెసింది. జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉందో..దీని బట్టే అర్ధమైపోతుంది. ఈరోజుల్లో ఇలాంటివి కామన్ అని అనుకుని సైలెంట్ అయిపోయారు అంతా..

 

అయితే, తాజాగా రణబీర్ నటించిన షంషేరా సినిమా జులై 22న విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రణ్‌బీర్‌ ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాదుతూ..ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నాడు. యాంకర్‌ సరదాగా ఒక గేమ్‌ ఆడించిగా..ఆ గేమ్ లో లైఫ్ గురించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ రివీల్ చేశాడు. ఈ గేమ్‌లో ‘రెండు నిజాలు, ఒక అబద్ధం’ చెప్పాలి అని రణ్‌బీర్‌ను ఆ యాంకర్‌ కండీషన్ పెట్టగా.. రణబీర్ మాత్లాడుతూ.. ‘నేను కవలలకు తండ్రి కాబోతున్నాను. ఇక నేను చాలా పెద్ద పౌరాణిక చిత్రంలో భాగం కాబోతున్నాను.

నేను కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోబోతున్నాను”..అంటూ చెప్పుకొచ్చారు. దీని బట్టి చూస్తే.. బ్రహ్మాస్త్రం సినిమాలో రణ్‌బీర్ నటిస్తున్న విషయం తెలిసిందే.. కాబట్టి, పౌరాణిక చిత్రంలో భాగం కానున్నాను అనేది నిజమేనని ఊహించడం తేలికైంది. కెరీర్ లో విరామం..ఇలాంటి క్రేజ్ ఉన్న టైంలో ఏ హీరో తీసుకోడు..సో, అలియా కవలలు ని కనబోతుందని..ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news