Moviesనాగార్జునను నమ్మించి దారుణంగా మోసం చేసిన ఆ స్టార్ హీరో ఎవరో...

నాగార్జునను నమ్మించి దారుణంగా మోసం చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఇంటి పేరు కి ఎంత గౌరవం ఉందో మనకు తెలిసిందే. అలాంటి గొప్ప పేరు ని సంపాదించి పెట్టారు అక్కినేని నాగేశవరావు గారు. ఇక ఆయన వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అదుగు పెట్టిన నాగార్జున కూడా తండ్రి కి తగ్గ తనయుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. ప్రజెంట్ గోస్ట్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న నాగ్..ఆ తరువాత ఓ ఫ్లాప్ డైరెక్టర్ ని లైన్లో పెట్టిన్నట్లు తెలుస్తుంది.

 

కాగా, గతంలో నాగార్జున ని ఓ యంగ్ హీరో..నమ్మించి అడ్డంగా మోసం చేశారట. ఇందస్ట్రీ వర్గాలు చెప్పుతున్న సమాచారం ప్రకారం.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నాగార్జున కూడా స్క్రీన్ ఓ కీలక పాత్రల్లో షేర్ చేసుకోవడానికి సీన్ చేశాడట. నిజానికి రజనీకాంత్ చేయాల్సిన పాత్ర అది. రజనీకాంత్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో…. నాగార్జున ని ఆ పాత్ర కోసం తీసుకున్నాడట ధనుష్. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున మాత్రమే కాదు ఎస్.జే సూర్య, శ్రీకాంత్, అదితి రావు హైదరిలు కూడా నటిస్తున్నారనే టాక్ బలంగా వినిపించింది.ఇంత మంది స్టార్స్ ఒకే సినిమాలో యాక్ట్ చేస్తుండడంతో సినిమా భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు.

రుద్ర అనే పేరు తో ఈ సినిమాను మల్టీస్టారర్ చిత్రంగా అనౌన్స్ చేశారు. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తిచేసుకున్నారు. కానీ ఎందుకో ఏమో అనుకోకుండా చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. నిర్మాతలతో ఇబ్బంది ఉండటం వల్లే ధనుష్ ఈ మల్టీస్టారర్ సినిమాని ఆపేసాడనే వార్తలు వస్తున్నాయి. అయితే, మరో పక్క..ధనుష్ కావాలనే ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశాడని. తను అనుకున్న విధంగా కధ రాకపోవడంతోనే..ప్రాజెక్ట్ ఆగిపోయిందని..వార్తలు వినిపించాయి.

అయితే, ఈ సినిమా ఆపేస్తున్నత్లు ఒక్క మాట కూడా నాగార్జునకి చెప్పలేదట. ఎలాంటి ఇన్ ఫర్ మేషన్ ఇవ్వకుండానే ..సడెన్ గా స్టాప్ చేసేసారట. దీంతో నాగార్జున బాధపడిన్నట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. మొత్తానికి క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనుకున్న ఈ సినిమా మధ్యలో ఆగిపోవడం పట్ల అప్పట్లో అభిమానులు కూడా బాగా డిసప్పాయింట్ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news