Movies40 ఏళ్ల త‌ర్వాత త‌ల్లులు అయిన హీరోయిన్లు వీళ్లే...!

40 ఏళ్ల త‌ర్వాత త‌ల్లులు అయిన హీరోయిన్లు వీళ్లే…!

సినిమా రంగంలో ఏళ్ల తరబడి నెట్టుకు రావడం అంత సులభమైన విషయం కాదు. అయినా సినిమా ఇండస్ట్రీలో నలభై సంవత్సరాల వరకు కూడా హీరోయిన్ లుగా చేసిన వారున్నారు. కొందరు అయితే సినిమా కోసం పెళ్లిళ్లు కూడా చేసుకోలేదు. ఇక పెళ్లి చేసుకున్న వారి సంగతి సరేసరి. కెరీర్ మోజులో పడి చాలా మంది హీరోయిన్ లు పిల్లలని లేట్ గా కంటారు. అంటే 40 సంవత్సరాల వయసులోనూ పిల్లలని కన్న భామలు లేకపోలేదు. అలా 40 ఏళ్లు దాటాక పిల్ల‌ల‌ను క‌న్న హీరోయిన్లు ఎవ‌రో ఒకసారి చూద్దాం.

అందాల తార ఐశ్వర్య రాయ్ :
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోల ఫస్ట్ ఆప్షన్ గా ఒక వెలుగు వెలిగారు. 2007 లో త‌న‌కంటే వ‌య‌స్సులో యేడాది చిన్నోడు అయిన‌ అభిషేక్ బచ్చన్‌ను పెళ్ళాడి వివాహబంధంలోకి అడుగు పెట్టారు. పెళ్ళైన తరవాత కూడా తన సినీ సెలబ్రిటీ జీవితాన్ని అంతే క్రేజ్ తో కొనసాగించిన అతి తక్కువ మంది హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. పెళ్ల‌య్యాక కూడా ఆమె సౌత్‌లో ర‌జ‌నీ స‌ర‌స‌న‌ రోబో చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.

ఒక బిడ్డకు తల్లియైన తర్వాత తన బిడ్డతో టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు నాలుగేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఐశ్వర్య. మళ్ళీ జాజ్బా అనే మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చి అంతే అందంతో అందరినీ ఆశ్చర్య పరిచారు ఈ ప్రపంచ సుందరి. కాగా ఈమె పెళ్ళైన నాలుగేళ్లకు తల్లయ్యారు. అపుడు ఐశ్వర్య బచ్చన్ వయసు 38. వీరి పాప ఆరాధ్యకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది.

బాలీవుడ్ నటి ప్రీతి జింతా :
ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగులో మ‌హేష్‌బాబు ఫ‌స్ట్ సినిమా రాజ‌కుమారుడు, వెంక‌టేష్ ప్రేమంటే ఇదేరా సినిమాలు చేసింది. ప్రీతి చాలాకాలం సింగిల్ గానే తన లైఫ్ ను లీడ్ చేసింది. ప్రీతి జింటా ఇక పెళ్లి చేసుకోరేమో అని ఒక టైం లో అంతా అనుకున్నారు కూడా. ఈమె తన అమెరికన్ బాయ్ ఫ్రెండ్ జీన్ గుడినాత్ ను 2016 లో పెళ్లి చేసుకుంది. ఈమె 46 ఏళ్ల వయసులో ఇద్దరు కవలలకు తల్లయ్యారు. సరోగసి పద్దతి ద్వారా ఒక పాప మరియు బాబుకు తల్లయ్యారు ప్రీతి.

బాలీవుడ్ నటి దియ మీర్జా :
ఈమె వ్యాపారవేత్త అయిన వైభవ్ రేఖిని ఫిబ్రవరి 2021 లో రెండో వివాహం చేసుకున్నారు. ఈమె 2021 మే 14 న ఒక మగ శిశువుకు జన్మనిచ్చారు అపుడు ఆమె వయసు 39. దియా కూడా చాలా రోజుల పాటు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించింది.
నటి గుల్ పనాగ్ :
2011లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్ళైన ఏడేళ్లకు ఈమె తల్లయ్యారు. అపుడు ఆమె వయసు 39 ఏళ్లు. వీరి బాబు పేరు నిహాల్.

అనిత :
ఈమెకు టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నువ్వు నేను చిత్రంతో యూత్ ను తన వైపుకు తిప్పుకున్న ఈ అందాల భామ ఆ తరవాత పలు చిత్రాలు చేసి బాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. ఆ తరవాత రోహిత్ ను 2013 లో గోవాలో వివాహం చేసుకున్నారు. 2021లో ఈమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చి తల్లి అయ్యారు. అపుడు ఈమె వయసు 39. వీరి కొడుకు పేరు ఆరవ్ రెడ్డి.
నటి లిసారే :
మ‌హేష్‌బాబు న‌టించిన ట‌క్క‌రిదొంగ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. లీసారే. ఆ త‌ర్వాత ఆమె అనారోగ్యాన్ని జ‌యించి నిల‌బ‌డింది. ఈమె కూడా 46 ఏళ్ల వయసులో సరోగసి పద్దతి ద్వారా ఇద్దరు కవలకు తల్లయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news