Moviesఆ మాటతో రాజమౌళి కాల్ కట్ చేసిన మహేష్..మ్యాటర్ సీరియసే..?

ఆ మాటతో రాజమౌళి కాల్ కట్ చేసిన మహేష్..మ్యాటర్ సీరియసే..?

రాజమౌళి..అదృష్టాని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నాడొ.. లేక ఆయన టైం అలా నడుస్తుందో తెలియడం లేదు కానీ..తీసిన ప్రతి సినిమా హిట్ కొట్టడమే కాకుండా కోట్లు కలెక్షన్స్ కలెక్ట్ చేస్తున్నాయి. అయితే రాజమౌళి ఎన్ని సినిమాలు తీసిన ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోవడానికి కారణం మాత్రం బాహుబ‌లి సిరీస్ అని చెప్పక తప్పదు. అంతక ముందు ఎన్ని సినిమాలు తీసిన మంచి పేరు సంపాదించుకున్నా..బాహుబలి సినిమా వేరే లెవల్. ఈ సినిమాతో ప్రభాస్ జాతం మారిపోయింది. ఇప్పుడు ఆయన రేంజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా ఇద్దరు బడా హీరోలతో తెరకెక్కించి మరో సాహసం చేశాడు. ఈ సినిమా ఎలా తెరకెక్కించాడొ తెలియాలి అంటే మార్చి 25వతేది వరకు ఆగాల్సిందే. అయ్యితే రాజమౌళి టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబుతో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. అసలు మూవీ గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికి..రోజుకో వార్త తెర పై హీట్ పుట్టిస్తుంది.

తెలుగు సినిమా సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి తో తమ అభిమాన హీరో సినిమా తెరకెక్కనుందంటేనే అభిమానులు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపై ఈ మధ్యే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చాడు. ద‌క్షిణాఫ్రికా అడవుల నేపథ్యంలో మహేశ్‌ బాబు సినిమా తెరకెక్కబోతుందని ఆయన చెప్పాడు. దీంతో మహెష్ ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో విలన్ గా ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ గోపీచంద్ ను ఫైనల్ చేసిఒన్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే గోపీచంద్ ను విలన్ గా చూపించదం మహెష్ కు నచ్చడంలేదట.. ఇదే విషయాని రాజమౌళికి చెప్పగా ఆయన విని వినన్నట్లు వింటూ..ఆన్సర్ ఇవ్వలేదట. దీంతో మహేష్ కు కోపం వచ్చి కాల్ కట్ చేశారట. టాలీవుడ్ ఇన్నర్ టాక్ ప్రకారం మ్యాటర్ కొంచెం సీరియస్ నే అంటున్నారు. మొదట నుండి రాజమౌళి గురించి అందరికి తెలిసిందే ఒక్కసారి ఫిక్స్ అయితే ఆయన మాట ఆయనే వినడు..ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news