Moviesపోరంబోకు ఎదవలు....కళావతి' సాంగ్ లీక్ పై మహేష్ షాకింగ్ రియాక్షన్..?

పోరంబోకు ఎదవలు….కళావతి’ సాంగ్ లీక్ పై మహేష్ షాకింగ్ రియాక్షన్..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు..అందాల తార కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. డైనమిక్ డైరెక్టర్ పరశూరం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. సరిలేరు నికెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ మళ్ళీ చాలా గ్యాప్ తీసుకుని మనముందుకు ఈ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మే22 న రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమాని తెర పై చూద్దామా అని ఆశగా ఉన్న అభిమానులకు కొద్ది గంటల ముందే భారీ షాక్ తగిలింది.

మహేశ్​బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్​ ‘కళావతి’ పాట ముందుగానే నెట్టింట లీక్ అయింది. నిజానికి ఈ పాటను చిత్ర బృందం ప్రేమికుల రోజున రిలీజ్ చేద్దాం అనుకుని..అనౌన్స్ మేంట్ కూడా ఇచ్చింది. ఇక ఈ కళావతి పాట అంతకన్నముందే నెట్టింట దర్శనమివ్వడంతో అభిమానులతో పాటు …మహేష్ బాబు,మ్యూజిక్ డైరెక్టర్ ధమన్..చిత్ర బృందం అందరు బాధపడుతున్నారు. దీంతో మహేశ్​ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇక ధమన్ అయితే బాధపడుతూ..ఓ వాయిస్ క్లిపీంగ్ ను కూడా రిలీజ్ చేసారు.

ఆ ఆడియోలో ఆయన ఈ పాట కోసం ఎంత కష్టపడ్డారో చెబుతూ..మా ప్రాణాలని ఒక్క బటన్ తో తీసేశాడు అంటూ ఎమోషనల్ అయ్యారు.ఇక తన పాటను యూట్యూబ్ లో చూసిన మహేష్ అయితే ఎప్పుడు లేని విధంగా కోపడ్డారట. మైత్రి మూవీ మేకర్స్ వాళ్లకు ఫోన్ చేసి చెడామడా తిట్టేశారట. నా పాటను లీక్ చేసిన ఆ పోరంబోకు ఎదవలు ఎవరు అంటూ ఆవేశంగా మాట్లాడారట, ఏది ఏమైనా ఇన్ని నెలల కష్టాని వాడు ఎవడొ ఒక్క నిమిషంలో నాశనం చేశాడు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే మహేష్ ఈ టైంకి ఎంతో హ్యాపీగా ఉండేవాడు..కానీ ఇప్పుడు తీవ్ర నిరాశ పడుతున్నాడు. ఇక ఆ కళావతి పాట లీక్ చేసిన వ్యక్తి..మాకు దొరికితే ..నరకం అంటే ఏంటో చూయిస్తాము అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news