Moviesబ్రోతల్ హౌస్ కు వెళ్లిన అనుష్క..శభాష్ అనిపించుకుందిగా..!!

బ్రోతల్ హౌస్ కు వెళ్లిన అనుష్క..శభాష్ అనిపించుకుందిగా..!!

సినీ ఇండస్ట్రీకి ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా వాళ్లల్లో కొందరు మాత్రమే అభిమానుల మనసుల్లో చిరస్దాయిగా నిలిచిపోగలరు. ఇక అలాంటి వారిలో అనుష్క కుడా ఒక్కరు. 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది అనుష్క శెట్టి.. తొలి సినిమాతోనే తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఆమె పదేళ్ల పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లో ఆమె తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడున్న యంగ్ స్టార్ హీరోలు అందరితోనూ కలిసి అనుష్క నటించింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది.

 

కేవలం గ్లామరస్ రోల్ లోనే కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలల్లో కూడా నటించి మెప్పించింది. ఇక అనుష్క సినీ కెరీర్ లోనే గుర్తుండిపొయే సినిమా “వేదం”. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా లో మంచు మనోజ్, అల్లు అర్జున్ లీడ్ రోల్స్ చేసి మెప్పించారు. మెసేజ్ ఓరియంటెడ్ గా వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అయినా.. సామాన్య ప్రజల మనసుకు హత్తుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అనుష్క ఓ వ్యభిచారిగా నటించి అందరికి షాకిచ్చింది. స్టార్ హీరోయిన్ గా ఉండేటటువంటి అనుష్క ఇలాంటి క్యారెక్టర్ చేస్తుందని అసలు ఎవరు ఊహించలేదు.

కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆమె పర్ ఫామెన్స్ చూసి అందరు ఆశ్చర్య పోయారు. ఆమె నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే అనుష్క ఈ సినిమాలో వ్యభిచారిగా నటించడానికి సైన్ చేసిన తరువాత బ్రోతల్ హౌస్ కు వెళ్లి అక్కడ వాళ్లు పడే బాధలను దగ్గరుండి చూసిందట.

వాళ్లు అసలు అలాంటి పనులు చేయడానికి గల రీజన్స్ తెలుసుకుని షాక్ అయ్యిందట. ఇక ఈ సినిమాలో అనుష్క నటన చూసిన పలువురు ప్రముఖులు కూడా శభాష్ అంటూ మెచ్చుకున్నారు. హీరోయిన్ అంటే ఏ పాత్రలు అయిన చేయగలగాలి అప్పుడే ఆమె నటిగా సక్సెస్ అయ్యిన్నట్లు. ఈ విషయంలో అనుష్క ఎప్పుడు నెం 1 అనే అంటారు ఆమె అభిమానులు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news