Moviesపునీత్ కాదు నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది..ఏడ్చేసిన స్టార్ హీరో..!!

పునీత్ కాదు నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది..ఏడ్చేసిన స్టార్ హీరో..!!

అక్టోబర్ 29న గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించిన విషయాన్ని కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మృతి చెంది రెండు వారాలు పూర్తి కావోస్తున్న ఇప్పటికీ ఆయన సమాధి వద్దకు వేలాదిగా అభిమానులు తరలివస్తున్నారు. తమ గుండెల్లో గూడు కట్టుకున్న స్టార్‌కి అంతే స్థాయిలో నివాళులు అర్పిస్తున్నారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గౌరవార్థం.. సంస్మరణ సభ బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరిగింది. ప్రభుత్వ పరంగా బెంగళూరులో జరిగిన సంతాప సభలో ప్రభుత్వ పెద్దలు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సంతాప సభకు పలువురు కన్నడ నటీ నటులతో పాటు.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీమా పరిశ్రమల ప్రముఖులు హాజరయ్యారు. ఇక్కడ బాధకర విషయం ఏమిటంటే..ఇంతకు ముందు ఆయన నటించిన ఎన్నో సినిమాల వేడుకలు ఇదే గ్రౌండ్ లో జరిగాయి. కానీ అనూహ్యంగా ఇప్పుడు అదే వేదికపై ఆయన శ్రద్ధాంజలి సభ జరుగుతుండడంతో అభిమానులు కనీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ఇలా జరుగుతుందని ఎవ్వరు కలలో కూడా ఊహించి ఉండరు. ఇక ఈ సభ మొదలైనప్పటి నుంచి అందరి కళ్ళలో కన్నీరు కనిపించింది.

ఇక ఈ సంస్మరణ సభ కు హాజరైన తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ పునీత్ ను తలచుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యారు. సరిగ్గా నాలుగేళ్ల కిందట వచ్చిన రాజకుమార సినిమాలో పునీత్ రాజ్ కుమార్ కు తండ్రిగా నటించాను అంటూ మట్లాడిన శరత్ కుమార్.. ఆయన బదులు తాను చనిపోయినా బాగుండేది అంటూ ఏడ్చేశాడు.అంతేకాదు ఇదే వేదికపై రాజకుమార 100 రోజుల వేడుక జరిగిందని.. ఇప్పుడు మళ్లీ ఇదే వేదిక పై పునీత్ శ్రద్ధాంజలి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు శరత్ కుమార్. “నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నానని.. కానీ ఆయన శ్రద్ధాంజలి నేను రావాల్సి వచ్చింది” అంటూ ఎమోషనల్ అయ్యాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news