Moviesఈ ఫోటోలో అంతా బాగానే ఉన్నా ఏదో తేడా కొడుతుందే..?

ఈ ఫోటోలో అంతా బాగానే ఉన్నా ఏదో తేడా కొడుతుందే..?

మెగా ఫ్యామిలీ ఇంట దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా ఫ్యామిలీలో దీపావళి సంబరాలు మిన్నంటాయి. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఈ మెగా సెలబ్రేషన్స్‌కి మెగా హీరోలు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి హల్ చల్ చేస్తున్నాయి. మెగా హీరోలంతా సాంప్రదాయ వస్త్రాల్లో సందడి చేశారు. ఇక ఈ దీవాళికి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో పాటు మెగా హీరోలు, మిగతా కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి పండుగ వేడుకులను ఘనంగా సెలబ్రెట్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

అయితే ఈ మెగా ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్‌లో సాయి ధర్మ్ తేజ లేని లోటు స్పష్ఠంగా కనిపించింది. వినాయక చవితి నాడు ఐకియా సమీపంలో మెగా మేనల్లుడికి యాక్సిడెంట్ జరిగిన విష్యం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో చికిత్స్ తీసుకుని పలు మైనర్ సర్జరిలు అనంతరం..కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అయితే ఆరోగ్యపరంగా బాగున్నా..ముఖం మీదా ఛాతీ మీద అయినా గాయాలు ఇంకా మానలేదు అన్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ మెగా దీపావళి సెలబ్రేషన్స్ కు దూరంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

 

ఇక అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలో రామ్ చ‌ర‌ణ్‌,అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, వైష్ణవ్ తేజ్, బాబీ, నిహారిక‌,చైత‌న్య‌ తో పాటు ప‌లువురు మెగా కుటుంబ స‌భ్యుల ఉన్నారు. కానీ ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ లేకపోవడంతో ఫ్యాన్స్‌ కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సాయితేజ్‌ ఇం​కా పూర్తిగా కోలుకోలేదా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా సాయి ధరం తేజ్ లేని లోటు ఈ ఫోటోలో బాగా కనిపిస్తుందనే అంటున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news