Newsచిరు ప‌క్క‌న త‌మ‌న్నా... సెటైర్లు మామూలుగా లేవుగా...!

చిరు ప‌క్క‌న త‌మ‌న్నా… సెటైర్లు మామూలుగా లేవుగా…!

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌డానికి త‌మ‌న్నా ఓకే చేసింది. చిరంజీవి – డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబినేష‌న్లో వస్తోన్న భోళా శంకర్ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా సెట్ చేయ‌డానికి మేక‌ర్స్ కు రెండు నెలల టైం ప‌ట్టింద‌ట‌. ఆమెకు భారీగా అడ్వాన్స్ ఇచ్చి ఎట్ట‌కేల‌కు ఓకే చేయించార‌ట‌. కోలీవుడ్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాను తెలుగులో భోళా శంక‌ర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు.

చిరు చెల్లికి కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. అయితే చిరు ప‌క్క‌న త‌మ‌న్నా హీరోయిన్ అన‌గానే సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సైరా మూవీలో వీరిద్ద‌రు క‌లిసి న‌టించారు. లావుగా ఉన్న చిరు ప‌క్క‌న స‌న్న‌గా ఉన్న త‌మ‌న్నా అస్స‌లు సూట్ కాలేద‌ని.. పైగా వీరిద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ సీన్లు చూసేందుకు కూడా చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయ‌ని కామెంట్లు ప‌డ్డాయి. మ‌ళ్లీ ఇప్పుడు చిరు ప‌క్క‌న ఈ మిల్కీబ్యూటీనే పెట్ట‌డంతో వీళ్ల‌ను తెర‌మీద ఏం చూస్తాం రా బాబు అని కామెంట్లు పెడుతున్నారు.

ఇక త‌మ‌న్నా కూడా రెగ్యుల‌ర్ సినిమాల కంటే సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న ఎక్కువ రెమ్యున‌రేష‌న్ వ‌స్తుండ‌డంతో ఈ సినిమాలు ఓకే చేసింద‌ట‌. కాజ‌ల్‌, న‌య‌న‌తార‌, అనుష్క అయితే చిరు ప‌క్క‌న కాస్త బందోబ‌స్త్‌గా ఉంటారు. వీళ్ల‌లో ఏ హీరోయిన్ చేసినా చూసేందుకు బాగుంటుంది. త‌మ‌న్నా మాత్రం అంత సూట్ కాద‌నే అంటున్నారు. మ‌రి మెహ‌ర్ – చిరు ఏ ఉద్దేశంతో త‌మ‌న్నాను సెట్ చేశారో ? ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుంచి మొదలుకానుంది. ఏకే ఎంట‌ర్టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news