Moviesఒకటి ,రెండు కాదు..ఏకంగా 13 ఏళ్ళ తర్వాత తన డీపీ మార్చిన...

ఒకటి ,రెండు కాదు..ఏకంగా 13 ఏళ్ళ తర్వాత తన డీపీ మార్చిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా..?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య పూర్తైయాయి. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించడం అందరిని కలచి వేస్తుంది. అక్టోబర్ 29 ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా ఆయనకు గుండె పోటురావడంతో… కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయినా పరిస్థితి విషమించడంతో.. హాస్పిటల్ లోనేచికిత్స పొందుతూ కన్నుమూశారు .

పునీత్ రాజ్ కుమార్., మరణ వార్త కెవలం సినీ ఇండస్ట్రీ వాళ్లనే కాదు..సామాన్య ప్రజలను సైతం కంటతడి పెట్టిస్తుంది. తీవ్ర శోకాని నింపుతుంది. ఇక పునీత్ హఠాన్మరణంతో సినీ లవర్స్ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణ వార్త విని అన్నీ ఇండస్ట్రీల స్టార్ ఆయనకు నివాళ్లు అర్పించారు. పునీత్‌కు కన్నడ ఇండస్ట్రీతోపాటు అన్నీ ఇండస్ట్రీలోనూ మంచు స్నేహితులు ఉన్న విషయం తెలిసిందే.

ఈక పునీత్‌కు సుధీప్ కిచ్చా కు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్క్ర్లేదు. ఫ్రెండ్ షిప్ అనే మాట సరిపోదు..అంతకు మించిన పదం ఏదైన ఉంది అంటే ది వీళ్ళకి సరిపోతుంది. పునీత్ సుదీప్ నాలుగు దశాబ్దాలనుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. అయితే సుదీప్ ట్విట్టర్‌లోకి వచ్చి దాదాపు 13 ఏళ్ళు అవుతున్న ..అకౌంట్ డీపీని మాత్రం మార్చలేదు.

కానీ ఇప్పుడు తన ప్రాణ స్నేహితుడు దూరం అవ్వడంతో భావోద్వేగానికి గురైన సుదీప్.. 13 ఏళ్ల తర్వాత తన డీపీని మార్చాడు. పునీత్ ఫోటోను డీపీగా పెట్టాడు. సోషల్ మీడియా వేదికగా పునీత్ మరణం పై స్పందించారు. మొదటి సారి ఆయన్ను శివ మొగ్గలో కలిశాను..అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. ఆ సమయంలోనే మనం ఫ్రెండ్స్ అయ్యాం అని చెప్పుకొచ్చారు. నీతో కలిసిన ప్రతి సందర్బం నాకు చాలా ప్రత్యేకమైనది అని రాసుకొచ్చాడు సుదీప్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news