Moviesషాకింగ్: సమంత కోసం పాట పాడిన సిద్ధూ.. మళ్లి తెర పైకి...

షాకింగ్: సమంత కోసం పాట పాడిన సిద్ధూ.. మళ్లి తెర పైకి వచ్చిన ప్రేమజంట..!!

నాగచైతన్య, సమంత ఈ రొమాంటిక్ కపుల్ ఇక నుంచి వేర్వేరుగా ఉంటారు. అన్న విషయం అటు ప్రేక్షకుల్ని, ఇటు ప్రముఖుల్ని షాక్‌కి గురిచేసింది. నాగచైతన్య, సమంత జంట మధ్య ఏదో జరుగుతోందని ఊహాగానాలు మొదలైన కొద్ది రోజులకే.. వాటిని నిజం చేస్తూ శనివారం మేం విడిపోతున్నాం తమ దారులు వేరని ఇద్దరూ ప్రకటించేసారు. ఇక ఈ జంట విడాకుల పై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ వారి జీవితం వారి ఇష్టం..మధ్యలో మనం ఇన్వాలవ్ అవ్వకూడదు వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇవ్వండి అంటూ పోస్ట్లు చేస్తున్నారు.

ఇక ఈ జంట విడాకుల విషయం అదికారికంగా ప్రకటించినప్పటి నుండి ఓ పేరు నెట్టింట బాగా వైరల్ అవుతుంది, ఆ పేరే దిద్ధార్ధ్. యస్.. గతంలో ఈ జంట ప్రేమించుకున్నారని..డేటింగ్ కూడా చేసారని.. అంతేనా ఈ జంట ఏకంగా గుడిలో పూజలు కూడా చేసారు. కానీ ఓన్ ఫైన్ డే సమంత అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టి..సిద్ధూకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు వీళ్ళు విడిపోతున్నారు అన్నప్పుడు సిద్ధూ చేసిన ట్వీట్ వరల్ గా మారింది.

‘మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు – స్కూల్‌లోని ఓ టీచర్‌ నుంచి నేను నేర్చుకున్న తొలి పాఠాల్లో ఇదొకటి’ అని హీరో సిద్ధార్థ్‌ ట్వీట్‌ చేశారు. అదీ నాగచైతన్య, సమంత ప్రకటన వెలువడిన తర్వాత! సమంతను ఉద్దేశించే ఆయన ట్వీట్‌ చేశారనేది నెట్టింట జనాల అభిప్రాయం. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్, సమంత కోసం పాడిన పాట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ టెలివిజన్ అవార్డ్స్ ఈవెంట్ లో సిద్ధార్థ్ సమంత కోసం కాదలన్ సినిమాలోని పాట పాడారు.ఇక ఇప్పుడు నాగ చైతన్య, సమంత విడాకులని ప్రకటించిన తర్వాత సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వల్ల మళ్లీ ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news