Moviesఅందరి ముందు అనుష్కను అంతమాట అనేసిన అభిమాని..పరువు పాయ్యే..!!

అందరి ముందు అనుష్కను అంతమాట అనేసిన అభిమాని..పరువు పాయ్యే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. ప్రత్యేకమైన పాత్రలలో నటిస్తూ మంచి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ గ్లామర్ బ్యూటీ.. బాహుబలి సినిమాలో నటించి గ్లోబల్ స్టార్ గా మారిపోయింది అనుష్క. గత 15 ఏళ్ల క్రిందట ‘సూపర్’ సినిమాతో పరిచయమై టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది.

వెండితెరపై స్వీటీ అందం, అభినయం చూసి అన్ని భాషా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గ్లామర్ డోస్ తో అడుగుపెట్టిన ఈ భామ వయసు నాలుగు పదులు దాటిన ఇంకా పెళ్ళికి దూరంగానే ఉంది. అసలు పెళ్ళి చేసుకుంటదా..? అని కూడా అభిమానుల్లో అనుమానాలు ఉన్నాయి. ఇక మా మధ్య ఏం లేదురా బాబోయ్ అంటున్న లేదు లేదు మీ మధ్య లవ్ ఉంది అంటూ ప్రభాస్ అనుష్క జంట పై రూమర్స్ క్రీయేట్ చేస్తున్నారు. ఇక ఈమె చివరిగా నటించిన నిశ్శబ్దం సినిమా గత సంవత్సరం విడుదల కాగా అదే చివరి చిత్రం అయ్యింది. ప్రస్తుతం అనుష్క ఓ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.

ఆ సినిమా రాజమండ్రి లో షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో కొన్ని రోజులపాటు రాజమండ్రిలోనే ఉన్నారట అనుష్క.ఇలా రైల్వే స్టేషన్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుష్కను చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో అక్కడ గందరగోళ పరిస్ధితి ఏర్పడిందట. ఈ క్రమంలో ఓ అభిమాని అనుష్క దగ్గరకు వెళ్ళి ఆటోగ్రాఫ్ అడిగితే.అనుష్క మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయారట. దీంతో ఆ అభిమాని డిస్సప్పాయింట్ అయ్యి.. ఆటోగ్రాఫ్ ఇవ్వలేదన్న కోపంతో అందరిముందు అరుంధతి సినిమా హిట్ అయిందని పొగరా.. నీకు అంత సీన్ లేదు ఆ సినిమా సోను సూద్, సాయి కుమార్ తమ్ముడి వాయిస్ వల్ల ఆ సినిమా హిట్ అయ్యింది అన్నాడట. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఈ క్రమంలోనే అనుష్కకు దగ్గర సన్నిహితులు బయట అభిమానుల మధ్యలో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news