Moviesకుర్రకారు గుండెల్లో గిలిగింత‌లు..పవర్ ఫుల్ పాత్రతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న...

కుర్రకారు గుండెల్లో గిలిగింత‌లు..పవర్ ఫుల్ పాత్రతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న ఆ కుందనపు బోమ్మ ..!!

కలర్స్ స్వాతి గురించి తెలియని తెలుగు సినీ అభిమాని ఉండడేమో.స్వాతి తన అందంతో ,చక్కటి చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. క‌ల‌ర్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల చిన్న‌ది స్వాతి కెరీర్ స్టార్టింగ్‌లో బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై మంచి అవ‌కాశాలు సొంతం చేసుకోవ‌డంతో పాటు ఎంతోమంది కుర్రకారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టింది. ఆమె చిలిపి చేష్ట‌ల‌తో క‌ల‌ర్స్ ప్రోగ్రామ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ప్రాయం నుంచే నటన మొదలు పెట్టిన ఈ అమ్మడు అనేక విజయవంతమైన సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి మెప్పించింది.

ఆ త‌ర్వాత ఆమె వెండితెర మీద కూడా స‌క్సెస్‌లు చూసింది. అనంతరం పలు సినిమాల్లో హీరోయిన్‌‌గా సైతం నటించింది. అయితే స్వాతి కి ఉన్న క్రేజ్ ని బట్టి చూస్తే మాత్రం ఆ స్థాయిలో హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయింది. మంచినటిగా ఈమెకు పేరున్నా అవకాశాలలో మాత్రం స్వాతి ఎప్పుడూ వెనకపడే ఉంటోంది. తెలుగులో ఆమె చివ‌రిగా లండ‌న్ బాబులు సినిమా చేసింది. ఈ సినిమా త‌ర్వాత ఆమె తిరిగి న‌టించ‌లేదు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ స్వాతి మ‌న‌స్సు టాలీవుడ్‌పై మ‌ళ్లింది. చాలా గ్యాప్ త‌ర్వాత ఆమె మ‌ళ్లీ టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను క‌నువిందు చేసేందుకు రెడీ అవుతోంది.మళ్లీ తాజాగా ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ.

కార్తికేయ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి ఇప్పుడు కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2 తోనే మరోసారి రీఎంట్రీ ఇవ్వబోతోంది. కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2 లో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ను ఎంచుకున్న విషయం తెలిసిందే. స్వాతిని ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఇక ఈ సినిమాతో స్వాతి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అని ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news