Newsకోట్ల విలువ చేసే ప్లాట్ ను చీప్ గా అమ్మేసిన స్టార్...

కోట్ల విలువ చేసే ప్లాట్ ను చీప్ గా అమ్మేసిన స్టార్ కపుల్స్.. రీజన్ తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..?

బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది క్యూట్ కపుల్స్ ఐశ్వర్య అభిషేక్ బచ్చన్. బ్లూ ఐస్ బ్యూటీ ఐశ్వర్య అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. అన్ని భాషల్లో నటించింది. మిస్ వరల్డ్ అయినా ఐసు ఎన్నో సక్సెస్ చిత్రాలలో నటించింది. అభిషేక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమెకన్నా అతగాడు వయసులో చిన్నవాడట. వీళ్లకు ఓ పాప కూడా ఉంది… ఈ జంట అందరికీ ఆదర్శంగా కనిపిస్తున్నారు.

అయితే గత కొంత కాలంగా వీళ్ల గురించి ఊసేలేదు. ఎక్కువ మీడియా ముందు కూడా కనిపించడంలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ జంట ఓ ఖరీదైన ప్లాట్ను అమ్ముకున్నాట్లుగా తెలుస్రుంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ముంబైలోని ఒబెరాయ్ 360 పడమరలో తనకున్న విలువైన అపార్ట్‌మెంట్‌ను అమ్ముకున్నడంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఇంత ఖరీదైన ప్లాట్ ను ఎందుకు అమ్ముకున్నాడొ తెలుసా..??

ఈ ప్లాట్ అమ్మితే అభిషేక్‌కు రూ.45.75 కోట్లు వచ్చాయట. అయితే, ఈ డబ్బు ద్వారా అభిషేక్ ఓ కొత్త సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నట్లు బీ టౌన్‌లో టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయం పై అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. అయితే అదే బిల్డింగ్‌లో హీరో షాహిద్ తన అపార్ట్‌మెంట్ కోసం రూ. 56 కోట్లు చెల్లించగా, కిలాడీ అక్షయ్ రూ.52.5 కోట్లు పెట్టి తన కోసం ఒక హౌజ్ కొనుగోలు చేశారు. అయితే ఇంత ధర ఉన్న ప్లాట్ కేవలం రూ. 45.75 కోట్లకు అభిషేక్ అమ్మడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాళ్లకు సినిమాలు లేకనే ఇలా చేశారా.. లేదా ఇంకేమైనా బలమైన కారణం ఉందా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news